Happy Easter 2020


12April 2020
పునరుద్ధాన ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
మత్తయి 28:1-7

యేసుప్రభువారి పునరుద్ధానం చారిత్రాత్మకమైన రుజువులతో కూడిన విజయం. లోకంలో దేవుళ్ళు,, దేవతలుగా పిలువబడుచున్న అనేకమైన వారు ఇప్పటికి వారి సమాధులు ఆలాగుననే ఉన్నాయి. కానీ యేసుప్రభువువారి పునరుద్ధానం గొప్పది యేసుప్రభువారి పునరుద్ధానం మనకు ఏమి కలుగ జేస్తుంది అని అంటే ఇది మనకు విశ్వాసమును, నిరీక్షణకు కలుగజేస్తుంది.

బైబిల్ గ్రంధము మనం ధ్యానిస్తే యేసుప్రభువారు చనిపోయిన తరువాత అరిమత్తయి యోషేపు అనే ఒక ధనవంతుడైన వ్యక్తి యేసు ప్రభువారికి తన కొరకు ఏర్పాటుచేసుకున్న సమాధిని ఆయనకు ఇచ్చారు. మూడవదినమున యూదుల శుద్దీకరణ ఆచారం ప్రకారం స్త్రీలైనటువంటి వారు ఆయనకు సన్నని నారవస్త్రములు సుఘంధ ద్రవ్యములు తీసుకువచ్చి అయన కొరకు వెదుకుచున్నారు యేసుప్రభువారు ఆదివారం తెల్లవారుచుoడగా దుతలైనవారు అక్కడకు వచ్చి యొక్క బలమైనటువంటి రాతిని దొర్లించగా యేసుప్రభువారు మూడవదినమున అయన చెప్పినట్లుగా సమాధి నుండి లేచారు యేసుప్రభువారు పునరుద్దనుడైయున్నారు.

1.యేసయ్య యొక్క పునరుద్ధానం మనకు ఏమి నేర్పిస్తుంది అని మనం ఆలోచిస్తే 

యేసుప్రభువారు పునరుద్ధానము శక్తివంతమైనటువంటిది, బలమైనటువంటిది 

1 థెస్సలొనీకయులకు4:13 సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. 

అయన పునరుద్ధానము మనకు ఏమి నేర్పిస్తుంది అని అంటే నిరీక్షణలేని యితరులవలె కాకుండా అయన బిడ్డలమైన మనము కూడా ఆలాగున పునరుద్ధాన శక్తిని పొందుకుటము అనే నిరీక్షణ కలిగి ఉండాలి అని మనకు ఏమి నేర్పిస్తుంది. యేసయ్య పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి.

***ప్రియులారా యేసయ్య మరణమును జయించాడు ఆలాగున మనం ఆత్మీయ మరణమును జయించాలి అని అంటే పాపములను అపరాధములను విడిచిపెట్టాలి.

ఎఫెసీయులకు2:1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

***లేకపోతె మనము ఆత్మీయంగా మృతులమే అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన సహోదరులారా ఈస్థితి నుoడి మనం భయటపడాలి.

ప్రకటన గ్రంథము3:1 క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే

***అయన మాట నిత్యం గైకొనువారిగా ఉంటేనే మనం జీవించినవారంతో సమానం అని దేవుని వాక్యం చెప్తుంది 

యోహాను8: 51 ఒకడు నా మాట గైకొనిన యెడలవాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 


2.మనకు పునరుద్ధానం శక్తి కావాలి అని అంటే మనం ఏమిచేయాలి అని అంటే 

యోహాను 5:24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను.

మనం అయన వాక్యమును గైకొని అయన యందు విశ్వాసం కలిగి ఉండాలి.
**ఇక్కడ మృతులు అనగా పాపమును జయించనివారు, మృతులు అనగా తమ అపరాధములను గ్రహించనివారు, మృతులు అనగా దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు, మృతులు అనగా ఎవరనగా దేవుని మాటలను విని అంగీకరించనటువంటివారు. అటువంటి వారికి మోక్షo కావాలి అని అంటే పునరుద్ధానం కావాలి అని అంటే నన్నువెంబడించాలి అని యేసుప్రభువారు వాక్యం ద్వారా ఈరోజున మనతో చెప్తున్నారు.

రోజున మరణమును జయించుట అంటే పాపములను అపరాధములను విడిచిపెట్టాలి.

అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు 5:14 లోకాశాలతో జీవిస్తున్నామనమందరం దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నాము అంటే మృతులతో సమానం నిద్రిస్తున్నవారితో సమానం అని దేవుని వాక్యం ద్వారా ఈరోజున యేసయ్య మనతో మాట్లాడుచున్నారు. ఈరోజున దేవుని వాక్యం గాని., దేవుని గాని అర్ధం చేసుకోలేకపోతున్నాము అని అంటే మనం నిద్రిస్తు, కాలాన్ని గడుపుచున్నాము అని అంటే అని అర్ధం.

అటువంటి స్థితి నుండి బయటకు రావాలి., ఈరోజున అటువంటి మరణంను జయించి బయటకు రావాలి అని యేసయ్య రోజున మనతో మాట్లాడుచున్నారు. ఎందుకు అని అంటే మన యేసయ్య ఇవి అన్నిటిని జయించారు అయన శోధనలను జయించారు, పాపాన్ని జయించారు, ఆకలిని, నిద్రను, బాధలను, చివరికి మరణమును జయించి, మరణపు ముల్లును విరిచి లోకమును జయించారు.

ఈరోజున మనం కూడా అయన నేర్పిస్తున్నఈ మాటలను మన జీవితంలో నేర్చుకొని దేవుని బిడ్డలుగా లోకశాలను అన్నిటిని జయించువారిగా ఈరోజున మనం ఉండాలి అని యేసయ్య మనతో చెప్తున్నారు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు మృతులలో నుండి లెమ్ము క్రీస్తును నీలో ప్రకాశించుము అని దేవుని వాక్యాo ద్వారా చెప్తున్నారు అయన రాకడ కొరకు సిద్దపాటు కలిగి ఉండాలి అని చెప్తున్నారు.

**అందుకే దేవుని వాక్యం ద్వారా అయన చెప్తున్నారు సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. కీర్తనల గ్రంథము 30:9, కీర్తనల గ్రంథము 6:5 యెషయా గ్రంథము 38:18-19 సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు.

3.ఈరోజున ఎందుకు మనం అయన పునరుద్ధానశక్తిని పొందుకోవాలి అని అంటే
**ఎందుకు అని అంటే మనలను శాశ్వతమైన పరలోకరాజ్యమును అందించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆయనే. యోహాను సువార్త 11:25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

ఈరోజున మనం ప్రతి క్షణం ప్రభువును వేతుకుతున్నాము అని అంటే మనం సజీవులము. ఈరోజున ప్రభువును స్తుతించడం లేదు అని అంటే వారు సజీవులు కారు అని అర్ధం. కావున ప్రియులారా మనం మరణoలో ఉన్నామా పాతాళంలో ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం మరణoలో నుండి జీవంలోనికి దాటే వారీగా మనం ఉండాలి, క్రీస్తు మనలో ప్రకాశించాలి.

ఎందుకు అని అంటే అటువంటి శాశనంను, మరణంను అయన జయించారు, అటువంటి విజయాన్ని మన యేసయ్య మన అందరికి ఈరోజున మన అందరికి ఇచ్చారు. ఆలాగున ఉండాలి అంటే దేవునికి విధేయులుగా ఉండాలి. మన అపరాధములనుండి, శోధనలను, చీకటిని జయించాలి, విశ్వాసంగా దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవాలి.
అయన మాటతప్పని దేవుడు, పునరుద్ధానుడు మన యేసయ్య. యేసుప్రభువారు శిష్యులైనవారితో చెప్పారు అయన మరణించి మూడవదినమున లేస్తాను అని కానీ అక్కడ స్త్రీలైనవారు ఆయనకు పూయుటకు శుఘంధ ద్రవ్యములను తీసుకువచ్చి అయన కొరకు వెదుకుచున్నారు. వారు సజీవుడైన యేసయ్యను మృతులలో వెదకు చున్నారు., అప్పటికే అయన మాట ఇచ్చిన ప్రకారం తెరిగిలేచారు., కానీ శిష్యులైనవారు యేసుతో తిరిగారు అయన చేసిన అద్భుతాలను చూసారు కానీ అయన చెప్పిన మాటను మరిచారు వారిని ప్రభువారు దర్శించి వారిని విశ్వాసంలో నడిపించి వారికీ మరింత నిరీక్షణతో నింపి నడిపించారు

ఈరోజున అయన పునరుద్ధానంతో మనకు విశ్వాసం ఇచ్చారు గొప్ప విజయాన్ని మనకు ఇచ్చారు ఈరోజున మనం ఎలాజీవిస్తున్నాము పరిపూర్ణంగా విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నామా లేకపోతె అనుమానంగా జీవిస్తున్నామా అవిశ్వాసులుగా అనాడు పేతురు వలే అల్ప విశ్వాసులుగా ఉంటున్నామా మనలను మనం ఆలోచించుకోవాలి


ఈరోజున మన విశ్వాసం పరలోకమునకు నడిపించాలి అందుకే ప్రభువారు అంటున్నారు నా యందు విశ్వాసం ఉంచేవారు చనిపోరు, చనిపోయిన బ్రతుకుదురు అని అంటున్నారు విశ్వాస వీరులవలె మనము ఉండాలి అటువంటి విశ్వాసం మనకు ఎంతో ధైర్యమును ఇస్తుంది. ఈరోజున పునరుద్ధానం దినమున యేసుప్రభువారు మనకు నేర్పిస్తున్న గొప్ప విశ్వాసం, నిరీక్షణ మన జీవితాలలో గొప్ప మార్పును కలిగి మన జీవితాలను సరిచేసుకొని, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అట్టి కృప మన అందరికి ఇప్పుడును ఎల్లప్పుడును మన ప్రభువైన యేసయ్య అందించును గాక ఆమెన్.


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్




No comments: