ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
అంశం:కనిపెట్టుట
అపొస్తలుల కార్యములు 1:1-4
చదవబడిన వాక్యములో కనిపెట్టుట అను దేవుని దూత చెప్తున్న మాటను మనం చూస్తున్నాము, పరిశుద్ద బైబిల్ గ్రంధములో ఈ కనిపెట్టుట అను మాటను గూర్చి చాల ప్రాముఖ్యంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున మనం కనిపెట్టుట అనగా అర్ధం ఏమిటి, ఎందుకు కనిపెట్టాలి, మనం ఎలా కనిపెట్టాలి ఈ మూడు అంశములు ఒకసారి పరిశీలన చేద్దాం. కనిపెట్టుట అనగా వెదుకుట, సైంటిస్ట్లు క్రొత్త విషయములు గూర్చి కనిపెడుతూ ఉంటారు, అలాగున ఇప్పుడు ప్రపంచవ్యాప్తిగా అనేక మందికి వ్యాపించిన కరోనా వ్యాధికి ఒక వాక్సిన్ గూర్చి కనిపెట్టుచున్నారు. అలాగున వారి ప్రయత్నంలో ఫలించినపుడు వారు వెదకినది కనిపెట్టారు అని అంటారు. రెండవదిగా కనిపెట్టుట అనగా ఎదురుచూచుట ప్రియులారా చిన్నపిల్లలు తల్లితండ్రుల కొరకు ఎదురుచూస్తూ ఉంటారు, అలాగుననే పని చేస్తున్నవారు వారి యజమాని తట్టు కొరకు నెల జీతము కొరకు కనిపెడతారు, రాత్రి కావాలి వారు ఉదయము కొరకు కనిపెడుతుంటారు. ఈరోజున మనం ఏదైనా ఇష్టమైనది వస్తుంది అని అంటే దానికొరకు ఎదురుచూస్తాం, కనిపెడుతూ ఉంటాం.
1.దేవుని బిడ్డలుగా మనం ఏవిషయంలో కనిపెట్టాలి, దేని కొరకు కనిపెట్టాలి కొన్ని అంశములు ఈ రోజున మనం ధ్యానిద్దాం.
**మనం దేని కొరకు కనిపెట్టాలి అని అంటే కడవరి దినములలో అయన వాగ్ధానము కొరకు కనిపెట్టాలి.
అపొస్తలుల కార్యములు 1:4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
మనమందరము నూతనసంవత్సరoలో దేవుని వాగ్దానము కొరకు కనిపెడుతూ ఉంటాం , ఆ వాగ్దానము గూర్చి ఆశతో ఎదురుచూస్తూ ఉంటాము, ఈ వాగ్ధనములు అనేవి అనేకము బైబిల్ గ్రంధములో ఆదికాండము మొదలుకొని అనేకము ఉన్నాయి. వాటిని మనం మర్చిపోయిన దేవుడు మనకు గుర్తు చేస్తాడు ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను స్వస్తపరుస్తాను, నేను నీకు ఉన్నాను భయపడకు అనే వాగ్ధానాలు చాల ఉన్నాయి, మనజీవితాలకు అశీర్వాదకరమైన వాగ్ధానాలు అనేకం ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు మనకు చెప్పే వాగ్దానము ఏమిటి అని అంటే తన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి, ఏమిటి ఆ వాగ్ధానము అంటే పరిశుద్దాత్మ కొరకు కనిపెట్ట్టుట. అవును మనం ఈ రోజున పరిశుద్దాత్మ అను వాగ్ధానము కొరకు కనిపెట్టాలి ఎందుకు అని అంటే ఆ పరిశుద్దాత్మ మనం పొందుకొనుట ద్వార, ఆ ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. మనం ఎందుకు కనిపెట్టాలి అని అంటే ఆ ఆత్మ మనలను పరలోక రాజ్యమునకు మనలను నడిపిస్తుంది, అది ఒక గొప్ప మార్గమై ఉన్నది. కనుక మనం దేని కొరకు కనిపెట్టాలి అంటే సత్యము మార్గము జీవమై ఉన్న యేసుప్రభువారు చెప్ప్తున్న మాట ఏమిటి అని అంటే పరిశుద్దాత్మ కొరకు కనిపెట్టాలి. వాక్యంలో చుస్తే వారు పరిశుదత్మతో నింపబడినప్పుడు అన్యభాషలలో వారు మాట్లాడారు. మనం పరిశుద్దాత్మ కొరకు కనిపెడితే అయన ఈ కడవరి దినములలో అయన మనలను పరిశుద్దత్మతో నింపి నడిపిస్తాడు.
**రెండవదిగా మనం దేని కొరకు కనిపెట్టాలి అని అంటే యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి.
విలాపవాక్యములు 3:26 నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
ఈ రక్షణ అనేది మన అందరికి ఆవసరం, ఏమిటి ఈ రక్షణ అని అంటే, మరణములో నుండి జీవములోనికి దాటుట. రక్షణ అనగా పాపములో నుండి పరిశుద్ద జీవితంలోనికి దాటుట. ఈ రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన శరిర, రక్తాన్ని మన కొరకు అర్పించారు. అయన మన కొరకు మరణిoచి తిరిగి లేచి ఉన్నారు. మన పాపములన్నిటి నుండి మనలను పవిత్రులను చేయడానికి అయన వచ్చారు. ఇది వాగ్ధనముతో కూడిన మాట. ఈ రక్షణ అనునది ఇది పరిపుర్ణమైనది, శాస్వతమైనది. అయన మరణ పునరుద్దానము ద్వార మనకు రక్షణ ఇవ్వబడుతున్నది, అది మనము పొందుకోవలసినమై ఉన్నాము.
రక్షణ పొందుకోవాలి అని అంటే మనం ఏమి చేయాలి అని అంటే నేను పాపిని అని తెలుసుకోవాలి, యేసు ప్రభువారు నిజమైన దేవుడు నా పాపముల నుండి విడిపించడానికి రక్షణ ఇవ్వడానికి మృత్రి నొంది తిరిగి లేచాడు అని విశ్వాసము ఉంచాలి. నా హృదయము లోనికి రా ప్రభువా అని ఆహ్వానించాలి, ప్రతి పాపమును వొప్పుకొని విడిచి పెట్టాలి, అయన రక్షణను తీసుకోవాలి, ప్రభుమార్గములో నడవాలి. అలాగునైతేనే మనం రక్షణ లోనికి అడుగు పెట్టాము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున మనం దేని కొరకు కాని పెట్టాలి అని అంటే అయన ఇచ్చు రక్షణ కొరకు కనిపెట్టు వారిగా మనం ఉండాలి.
**ముడవదిగా రక్షణకొరకు ఆశపెట్టుకొని ఉండాలి.
కీర్తనల గ్రంథము 119:81 నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను 82 నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించు చున్నవి.
దావీదు అటు కుటుంబము నుండి వచ్చిన సమస్యలు, ప్రజల నుండి వచ్చిన సమస్య వలన ఎన్నో బాధలలో ఉండగా అయన ఎవరి వైపు చూస్తున్నాడు అని అంటే దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకు అని అంటే అయన చేసిన వాగ్ధనములన్నిటిని గుర్తు చేసు కొంటున్నాడు. దేవా నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచున్నాను అని సెలవిస్తున్నాడు. మనం ఈరోజున దేని కొరకు కనిపెట్టాలి అని అంటే అయన మాట కొరకు కనిపెట్టాలి, ఎందుకు అని అంటే అయన మాట మనలను బ్రతికిస్తుంది, అయన మాట మనలను ఒదారుస్తుంది, ఆమాట మనలను ఆదరిస్తుంది, అంతేకాకుండా అ మాట మనలను బలపరుస్తుంది. అటువంటి అయన మాట కొరకు ఈరోజున మనం కనిపెట్టుకొని ఉండాలి, ఆశతో అయన వాక్యము కొరకు ఈరోజున అందరం కనిపెట్టాలి, చాల మంది ఈరోజున ప్రతికూల సమయంలో దేవుని మందిరమునకు వెళ్ళలేని స్థితిలో భాదతో ఎవరి ఇండ్లలో వారు ఉండి దేవుని మాట కొరకు ఎదురుస్తున్నారు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో దావీదు అదే కనిపెట్టుచున్నాడు అయ్యా నీవిచ్చిన మాట కొరకు కనిపెడుతున్నాను అని అంటున్నాడు.
కీర్తనల గ్రంథము 37:34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
**నాల్గవదిగా దేవుని ఉపదేశము కొరకు అనుదినము కనిపెట్టువారిగా మనం ఉండాలి.
సామెతలు 8:34 అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
మనము అయన వాక్యము కొరకు అయన ఉపదేశం కొరకు అనుదినము కనిపెట్టాలి ఎలాగున అంటే ప్రభువా
మాతో మాట్లాడండి, నీ సేవకుల ద్వార, నీ ఉపదేశల ద్వార మాతో మాట్లాడండి, బైబిల్ గ్రంధము చదువుట ద్వార
మాతో మాట్లాడండి, నీ దర్శనముల ద్వార మాతో మాట్లాడండి అని కనిపెట్టాలి. ఆవిధంగా కనిపెట్టుకుంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలము అని దేవుని వాక్యం చెప్తుంది.
**ఐదవదిగా మనం దేని కొరకు కనిపెట్టాలి అని అంటే ప్రభువు రాకడవరకు ఓపికతో కనిపెట్టాలి.
యాకోబు 5:7 సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి;
ఈలోకంలో మన జీవితంలో ఉదయము మొదలు కొని రాత్రి వరకు తిరిగి మరల రాత్రి మొదలు కొని ఉదయము కొరకు నిత్యము భయాలే నిత్యము మన జీవితములో కష్టమే, శ్రమలే, భాదలే కానీ ఇవి శాశ్వతము కాదు, గాని నీతి కలిగిన శ్రేష్టమైన అయన రాజ్యములో చేరటమే శాశ్వతము, అయన రెండవరాకడ కొరకు కనిపెట్టాలి. ఆయన మొదటి రాకడ మనకు రక్షణ ఇవ్వడానికి అయన తన ప్రాణాన్ని సమర్పిస్తే, అయన రెండవ రాకడ అయన ఇచ్చిన రక్షణ పొందుకొని అయన కొరకు సిద్దపడిన వారిని అయన రాజ్యమునకు తీసుకు వెళ్ళడానికి వచ్చే సమయం కొరకు అయన రాకడ కొరకు మనం కనిపెట్టాలి. అయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ దొంగ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు కానీ ప్రాముఖ్యమైన అయన రెండవ రాకడ కొరకు మనం సిద్దపడి కనిపెట్టువారిగా ఈరోజున మనం ఉండాలి.
**మనం దేని కొరకు కనిపెట్టాలి అని అంటే క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును
2 పేతురు 3:13 అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
ఏమిటి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అని అంటే మనిషికి ఈ భూమి కంటే యే గ్రహములో నివసించడానికి లేదు కానీ, భూమి ఇది ఒక రోజున శిదిలమై పోతుంది, అప్పుడు దేవుడు మనకు ఒక శాశ్వతమైన క్రొత్త భూమిని ఆకాశమును ఇస్తాడు అని అంటున్నాడు, బైబిల్లో పరలోకము అని వ్రాసి ఉన్నది, అయన ఆకాశము నుండి అయన సింహసనము నుండి భూమి మీద తన నరులను చుచుచున్నాడు అని వ్రాయబడినది. అదే ఒక గొప్ప రాజ్యము అది దేవుడు తన ప్రజలు నివసించే ఒక శ్రేష్టమైన స్థలం ఆరాజ్యము లోనికి మనలను తీసుకు వెళ్ళాలి అని అంటే అయన మార్గములో నడవాలి రక్షణ పొందాలి అయన అడుగు జాడలలో నడవాలి.
**అయన మనపట్ల చేయబోవు గొప్ప కార్యముల కొరకు ఆశక్తితో కనిపెట్టాలి
1సమూయేలు12:16 మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
శత్రువుల విషయంలో ఉగ్రత సంభంద ఈ గొప్ప కార్యముల కొరకు తన ప్రజలైన వారిని రక్షించుకొను విషయంలో యెహోవా చేస్తున్న గంభీరమైన గొప్ప కార్యముల కొరకు కనిపెట్టాలి. అయన మనం ఏమి అడుగు చున్నామో వాటిని కొరకు కనిపెట్టాలి, అయన మన కొరకు ఏమి అద్భుతములు చేయబోతున్నాడో విశ్వాసముతో అడిగి వాటిని కొరకు మనం కనిపెట్టాలి.
**అయన దర్శనవిషయము కొరకు కనిపెట్టాలి.
హబక్కూకు 2: 3 ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
**అయన కొరకు కనిపెట్టువారు నూతన పొందుదురు.
యెషయా గ్రంథము 40:31 యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
అయన కొరకు కనిపెడితే ఎటువంటి నూతనబలము పొందుకుంటాము అని అంటే అది అయన రాకడ సమయంలో తిరిగి ఆయనతో లేవడానికి కావలసిన ఆత్మబలమును మనం పొందుకొంటాము.
**యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
కీర్తనల గ్రంథము 37:9 కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు అంటే ఇక్కడ దేశము అని అంటే అయన పరలోకము అనే నూతన ఆకాశమును నూతన భూమిని స్వతంత్రించుకొంటాము..
2.ఎలా మనం యెహోవాకొరకు కనిపెట్టాలి అని అంటే
**సహనముతో పరమతండ్రి ఐన దేవుని కొరకు ఆశతో కనిపెట్టువారిగా ఉండాలి.
కీర్తనల గ్రంథము 40:1 యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
**కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా కనిపెట్టాలి
కీర్తనల గ్రంథము 130:5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను. 6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
ఈరోజున ఈలోకసంబందమైన వాటి కొరకు కాకుండా శాశ్వతమైన అయన రాకడ కొరకు అయన రెండవ రాకడ కొరకు మనం కనిపెడుచున్నమా, అయన జరిగించు గొప్పకార్యముల కొరకు, అయన మాట కొరకు కనిపెడుచున్నమా, దేని కొరకు మనం ఈరోజున కనిపెట్టుచున్నాము మనలను మనం పరిశీలించుకోవాలి.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***********************************************************************
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev M.అనందవరంగారు.
మత్తయి సువార్త 20:20-24 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా 21 నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
చదవబడిన వాక్యభాగాములో తల్లి అను ఒక మాటను మనం చుస్తుంటున్నాము. బైబిల్ గ్రంధములో తల్లిని గూర్చి అనేకమార్లు వ్రాయబడినది, ఈ మాట విన్న ప్రతిసారి మన హృదయములో ఒక రకమైన ఆనందము కలుగుతుంది ఈరోజున మదర్స్ డే ను ప్రత్యేకముగా మనము అందరము పాటిస్తూ ఉంటున్నాము ఎందుకు అని అంటే తల్లి ప్రేమ అపరామైనటువంటిది, తల్లి యొక్క ప్రేమ ఎంతో విలువైనటువంటిది, కొదువలేనటువంటిది, ఎంతో గొప్పది.
అటువంటి గొప్పదైన తల్లి యొక్క ప్రేమను గూర్చి బైబిల్ గ్రంధములో ఏమి వ్రాయబడినదో ఈరోజున మనం ధ్యానించుకుందాం.
మొదటిగా మనం చుస్తే తల్లి ప్రేమ స్వార్ధపురితమైన ప్రేమ
వాక్యములో మనం చుస్తే తల్లి ప్రేమను గూర్చి ఎంతో గొప్పగా వ్రాయబడినది. ఒక తల్లి తన బిడ్డలైన వారిని యేసుప్రభువారి యొద్దకు తీసుకువచ్చి ఆయనకు ఒక మనవి చేస్తున్నట్లుగా మత్తయి సువార్త 20:20లో మనం చూస్తాం. అది ఏమిటి అని అంటే నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. తన బిడ్డలా పట్ల ఒక స్వార్దపురితమైన ప్రేమను కలిగి ఉన్నది ఎందుకు అని అంటే ఆమె తనకున్న ఆశను బట్టి తన కోసం కాదు గాని తన పిల్లల కోసము వారు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అలోచించి అటువంటి ప్రేమను కలిగి యేసుప్రభువారితో ఆవిధంగా పలికినట్లుగా మనం చూస్తున్నాము.
ఈరోజున ఒక తల్లిగా బిడ్డలైన వారికీ ఏమి నేర్పించాలి అని మనం ఆలోచిస్తే
ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే ఒక తల్లిగా తన బిడ్డలను దేవునిలోనికి నడిపించువారిగా ఉండాలి. ఎలాగైతే జెబెదయి కుమారుల తల్లి తన బిడ్డలైన వారిని ఏలాగున దేవుని దగ్గరకు తీసుకువస్తున్నదో అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజున ఎంతమంది తల్లులు తమ యొక్క భాద్యతగా తన బిడ్డలను దేవుని యొద్దకు తీసుకోని వస్తున్నవారిగా ఉంటున్నాము. మనలను మనం ఒకసారి పరిశిలించుకొవలసిన వారమైఉన్నాము. ప్రియ తల్లులార పిల్లలనైనటువంటివారిని నిర్లక్ష్యాపరచకండి, వారిని లోకశాలోనికి తీసుకువెళ్ళకుండా యేసుప్రభువారి దగ్గరకు తీసుకురండి, ప్రార్ధనలో బలపరచండి, దేవుని వాక్యము నేర్పించండి, దేవుని మార్గాలను నేర్పించండి సత్యాలను అనుసరించేటట్లుగా వారికీ నేర్పించండి, వారిని యేసయ్య దగ్గరకు నడిపించాలి.
ఈరోజున మనం ఏమి నేర్పిస్తున్నాము, ఏమి అనుసరించేటట్లుగా మనం ప్రయతిస్తున్నాము.
ఈరోజున మనం వారికీ మనం శాపాలను తీసుకువస్తున్నమా, లేదా దేవుని ఆశీర్వాదాలను తీసుకువస్తున్నమా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తన పిల్లలు శారీరక విషయాలలో గొప్పవారిగా ఉండాలి అని కాకుండా, నా పిల్లలు ఆధ్యాత్మిక విషయాలలో ఎదగాలి గొప్పవారిగా ఉండాలి అని ఆలోచించాలి, ఆవిధంగా వారికీ నేర్పించాలి, భోదించాలి, అవసరమైతే హెచ్చరించాలి. మనతో ఆరాధన చేయువారిగా, దేవుని సన్నిధిలో గడిపేవరిగా ఆత్మీయంగా చక్కదిద్దాలి. కుటుంభాన్ని కట్టుకోవాలి దేవునిలో ఎదగాలి అటువంటి పనిని జెబెదయి కుమారుల తల్లి చేసింది తన బిడ్డలు నశించిపోకుండా దేవుని వద్ద ఉండాలి అని ఆమె కోరిక కలిగినది, ఈరోజున తల్లిగా తన బిడ్డలను నశించిపోకుండా దేవునిలోనికి నడిపించువారిగా అటువంటి స్వార్ధపురితమైన ప్రేమ కలిగి ప్రతి తల్లి అటువంటి ఆలోచన కలిగి ఉండాలి.
రెండవదిగా తల్లి ప్రేమ త్యాగాపురితమైన ప్రేమ
ఒక తల్లి ఎంత త్యాగం చేస్తుంది అని అంటే తన బిడ్డను గర్బమును ధరించినది మొదలు కొని బిడ్డలను ప్రసవించేటపుడు ఆమె పడే భాద ఎంతో గొప్పది. తన బిడ్డ పట్ల ఎంతో అధ్బుతమైన ప్రేమను కలిగినది. తన కడుపు మాడ్చుకొని తన బిడ్డల ఆకలిని తీర్చేది తల్లి. అటువంటి గొప్ప ప్రేమ కలిగినది తల్లి, అటువంటి తల్లి ప్రేమ త్యాగాపురితమైన ప్రేమ.
ఆధ్యాత్మికంగా పరిశుద్ద గ్రంధములో తన బిడ్డలకోరకు ప్రాణమిచ్చిన తల్లిని గూర్చి మనం చుస్తే
శారాయి తనకు లేక లేక పుట్ట్టిన బిడ్డ దేవుని కోసం తన బిడ్డలను త్యాగం చేసినట్లుగా, రిబ్కను రాహేలును హన్నాను, బెత్షబాను గూర్చి మనకు తెలుసు. అభ్రాహము తన బిడ్డను దేవుని అర్పించడానికి తీసుకువెళ్ళినపుడు శారాయికి కలిగిన బాధను మనం చూస్తాం. మిర్యము ఒక ప్రవక్త్రి ఒక తల్లిని గూర్చి మనం పరిశుద్ద గ్రంధములో చూడవచ్చు, ఇంకా ఎంతో మంది తల్లులును గూర్చి బైబిల్ గ్రంధములో వ్రాయబడినది. ఈరోజున ఒక తల్లిగా చేయవలసినది ఏమిటి అని అంటే తల్లులార పిల్లలకు నేర్పించండి, పిల్లకు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించండి, ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్పించండి, నీతిని అలవాటు చేయాలి, న్యాయమును నేర్పించండి, క్రమశిక్షణా, సత్య మార్గమును నేర్పించండి. ఈరోజున తల్లిగా అటువంటి భాద్యత కలిగి ఉండాలి. ఎన్నో శ్రమలుపడి అవమానాలు పడి, నిదందలు పడి ఎన్నోత్యాగాలు చేసినది తల్లి, తల్లి ప్రేమ త్యాగాపురితమైనది.
ఈరోజున మనం ఎలాంటి తల్లిలుగా ఉంటున్నాము ఆలోచించుకోవాలి.
తల్లి నీతిగా బ్రతకాలి, నీతిని తన బిడ్డలకు నేర్పించాలి, ఆమె యదార్ధముగా ఉండాలి, తన బిడ్డలకు యదార్ధముగా ఉండటం నేర్పించాలి. భక్తి కలిగిన మార్గంలో ఉండాలి, తన బిడ్డలను ఉన్నతమైన ఆత్మీయస్తితిలో నడిపించాలి. దేవుని కొరకు వాడబడే ఒక క్రమము కలిగిన బిడ్డలుగా,ఒక క్రమము పాటించు బిడ్డలుగా తల్లులు వారికీ నేర్పించాలి అని మనం తెలుసుకోవాలి. దేవుని కొరకు, దేవుని రాజ్యములో తన బిడ్డలు చేరాలి అని ప్రతి తల్లి ప్రార్దించే తల్లిగా ఉండాలి, అని ప్రేమపుర్వకంగా ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలి.
బైబిల్ గ్రంధములో హన్నా తాను చేసిన ప్రమాణాన్ని, మొక్కుబడిని నేరవేర్చినది. దేవుని కొరకు తను ఇచ్చిన వాగ్ధానమును ప్రకారం తన బిడ్డను దేవుని కొరకు ఇచ్చింది, ఉన్నతమైన ఆత్మీయస్తితిలోనికి నడిపించింది. మరియొక ప్రాముఖ్యమైన తల్లి స్త్రీలలో ఆశిర్వదించబడిన తల్లి మరియాను గూర్చి మనం ఆలోచిస్తే ఆమె యవ్వన కాలములో గడిపిన పరిశుద్ద జీవితం వలన దేవుని చేత ఎన్నుకోబడినది, అటుతరువాత తల్లిగా మార్చబడినపుడు యేసుప్రభువారికి జన్మనిచ్చిన తరువాత ఆయను ఎంతో శ్రద్ధ కలిగి ప్రేమతో చూసుకున్నది. మనం చుస్తే ఆమె ఎల్లపుడును కుడా యేసుప్రభువారి వెంట ఉంది ఎల్లప్పుడు ఆయనను కనిపెట్టుకొనిన, కాపాడుకొనిన తల్లిగా ఆమె ఉంది. ఎందుకు అని అంటే అయన తన ప్రియ కుమారుడు.
ఈరోజున మనం ఎలా ఉండాలి అంటే సోలమోన్ మహాజ్ఞాని అంటాడు ఈరోజున మనం తల్లి యొక్క బోధను వినేవారిగా మనం ఉండాలి. సామెతలు 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము..
ఈరోజున సంఘము మనకు ఒక తల్లి
అందుకే అంటారు తల్లి సంఘము అని తల్లి మనపై ఎంతగోనో ప్రేమ చూపించి మనలను అన్ని విషయాలలో ఆదుకొంటే, దేవుడు మనలను అంత కంటే ఎక్కువగా మనకు తోడై ఉండి దైర్యపరచి మనలను అదుకొంటాడు. అందుకే యేసుప్రభువారు అంటారు ఈరోజున ఎవరు విడిచిన నేను నిన్ను విడువను ఎదబాయను అని. మనం మన తల్లిని ఎలా ప్రేమిస్తామో అలాగుననే మనం మన సంఘమనే తల్లిని కుడా అంతగా మనం ప్రేమించాలి. ఇక్కడ మనం ఎలా వుండాలి అని అంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మీయ ఆహారమును పొందుకొని దేవునిలో గొప్పగా ఎదగాలి.
అటువంటి దేవునికి ఈరోజున మనం ఏమిచేయాలి అని ఆలోచిస్తే
కీర్తనల గ్రంథము 139:13 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. 14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
ఈరోజున మనం చేయవలసినది ఏమిటి అని అంటే తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే అని మనలను పుట్టించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మాటలను అనుసరించే వారిగా ఉండాలి. మన శారీరక తల్లి యొక్క అడుగు జడలలో జీవించాలి, తల్లి మాటలకు లోబడాలి, తల్లిని అనుసరించాలి. తల్లిగా జెబెదయి కుమారుల తల్లి తన కుమారులను దేవుని దగ్గరకు నడిపించినట్లుగా తన బిడ్డలను దేవుని యొద్దకు నడిపించేవారిగా ఆ తల్లి వలే తన బిడ్డల కొరకు దేవుని పాద సన్నిధిలో మొరపెట్టువారిగా ప్రతి తల్లి ఉండాలి, సహనము కలిగి, భారము కలిగి క్రమశిక్షణతో తన బిడ్డలను నడిపించాలి, దేవుడిచ్చు అశీర్వదాలను తన కుటుంభాలకు అందించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అట్టి కృప మన అందరికి కలుగును గాకా ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
*****************************************************
17May2020
అదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశము: పరిశీలన చేసుకొనుట (Examine Yourself)
2 కొరింథీయులకు 13:5 మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా
చదవబడిన వాక్యములో పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు వ్రాస్తూ ఈ మాటలను పలుకుచున్నట్లుగా మనం చూస్తాం. మనం ఈరోజున ధ్యానించుకోబోయే అంశము ఏమిటి అని అంటే మనలను మనం పరిశీలించుకోనుట, మనలను మనం శోదించుకోనుట., మనలను చూచుకొనుట, ఈ మూడు మాటలు ఒకే అర్ధమును ఇస్తుంది. మనలో చాల మందికి ఇతరులకు ఏదో ఒక విషయం గూర్చి చెప్పాలి అని ఆశ, ఆలోచన కలిగి ఉంటాము, ఐతే పరిశుద్ద గ్రంధము ఏమి చెప్తుంది అని అంటే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు గాని, భోదించేటప్పుడు గాని మనలను మనం ఒకసారి పరిశీలించుకోవాలి అని బైబిల్ గ్రంధం మనకు చెప్తుంది.ఈరోజున మనం ఏ విషయాలలో పరిశీలన చేసుకోవాలో దేవుని వాక్యం మనకు ఏమి చెప్తుందో పరిశుద్ద గ్రంధములో ఏమి వ్రాయబడినదో మనం ధ్యానించుకుందాం
ఈరోజున అంశంను గూర్చి బైబిల్ గ్రంధములో దావీదు పలికిన మాటలను మనం చుస్తే
కీర్తనల గ్రంథము 26:2 యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో ధించుము.
అదేవిధంగా యోబు గారు పలికన మాటలను ఒకసారి మనం ధ్యానిస్తే
యోబు గ్రంథము 13:23 నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
మనలను మనం పరిశీలించుకోవాలి అని యేసుప్రభువారు పలికిన మాటలను మనం చుస్తే
మత్తయి సువార్త 7:1-4 నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? 5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.
మనలో తప్పులు పెట్టుకొని ఇతరుల తప్పులను వెదకు వారిని గూర్చి ఇక్కడ వాక్యంలో చెప్తునట్లుగా మనం చూస్తాం. అలాగే ఒక పాపాత్మురాలైన స్త్రీ ని గూర్చి మీలో ఎవరు పాపము లేనివారో, వారు మొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. ఈరోజున ప్రతి యొక్క వ్యక్తి ప్రతి ఒక్కరు మనం మనలను పరిశీలించుకోవాలి, మన ప్రవర్తనను మనం చూచుకోవాలి, మనం ఎలా మాట్లాడుచున్నమో చూచుకోవాలి, కుటుంభ సభ్యుల విషయంలో ఎలా ఉంటున్నామో మనం చూచుకోవాలి, భర్త-భార్య విషయంలో, భార్య-భర్త విషయంలో ఎలా ఉంటున్నామో చూచుకోవాలి. అలాగే పిల్లలుగా తల్లితండ్రుల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో తమ చదువుల విషయంలో ఎలా ఉంటున్నామో మనం ఎంత వరకు మంచిగా వుంటున్నమో మనం పరిశీలించుకోవాలి, అలాగే ఉద్యోగము చేసే చోట ఇతరులతో మనం ఎలా ఉంటున్నాము అని మనలను మనం పరిశోదించుకోవాలి అని దేవుని వాక్యం మనకు వివరంగా చెప్తుంది.
ఈరోజున మనం ఏ విషయంలలో మనలను మనం పరిశీలన చేసుకోవాలి అని ఆలోచిస్తే
1.మొదటిగా మనం మన ప్రవర్తన ఎలా ఉన్నది అని చూసుకోవాలి
మనం ప్రతి విషయంలో మనలను మనం చూసుకోవాలి,నన్ను నేను పరిశీలనచేసికొంటిని అన్న దావీదు మాటలను మనం జ్ఞాపకం చేసుకొంటే
కీర్తనల గ్రంథము 119:59 నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.
ఇక్కడ మార్గము అనగా మన ప్రవర్తన ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే ముందుగా మనలను మనం పరిశీలన చేసుకోవాలి., ఇది మన జీవితంలో ఎంతైనా అవసరం మరియు ఎంతో ప్రముఖమైన అంశం.
2.రెండవదిగా మన విశ్వాసమును పరిశీలన చేసుకోవాలి
ఈరోజున ప్రియులారా మన విశ్వాస పరిమాణం ఎంత, ఈరోజున దేవునిలో మనకు ఉండవలసిన విశ్వాసం ఎంతో మనం ఆలోచించుకోవాలి. బైబిల్ గ్రంధములో యేసుప్రభువారు విశ్వాసమును గూర్చి పలికినట్లుగా నీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటె ఈ కొండను సముద్రములో పడమనగా నీవు పడద్రోయుదువు అని చెప్పారు, ఈరోజున దేవునిపై మనకు కొండంత విశ్వాసము కలిగినవారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంధములో ఎందరో భక్తులు దేవునిపై వారికి ఉన్నగొప్ప విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు చేయగలిగారు, పేతురును గూర్చి చుస్తే ఆయనకున్న గొప్ప విశ్వాసమును బట్టి నీటి మీద నడవగాలిగాడు. ఆదిమ క్రైస్తవులు విశ్వాసమును బట్టి హింసలు పడ్డారు వారి విశ్వాసమును బట్టి సింహపు బోనులోనికి వెళ్ళి వారి ప్రాణాలను సైతం అర్పించారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, అంతే కాకుండా వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మన విశ్వాసం దేవునిలో ఉన్నదా లేదో మనం పరిశీలన చేసుకోవాలి ఆరీతిగా మనం ఆలోచించుకోవాలి.
ఈరోజున అటువంటి విశ్వాసము కలిగి ఉంటున్నామా మనలో ఏమైనా లోటు ఉన్నదా మనం పరిశీలన చేసుకోవాలి.
రోమీయులకు12:3 తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
3.ముడవదిగా దేవుని వాక్యమును విని ఆ ప్రకారం ప్రవర్తిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి.
యాకోబు 1:23 ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
ప్రియమైన వారలారా ఇక్కడ అద్దము అనగా దేవుని వాక్యం అద్దము అనగా దేవుని సన్నిది, మనం దేవుని సన్నిదిలో మన ప్రవర్తన సరిచేసుకోనుచున్నామా మనలను పరిశీలించుకోవాలి , ఆధ్యాత్మిక సౌందర్యము కలిగి ఉంటున్నామా మనం పరిశీలించుకోవాలి, ఆ వాక్యం విని మనం మారుచున్నామా, మన జీవితంలో మనం ఎంతవరకు సరిచేసుకోనుచున్నాము అని దేవుడు ఈరోజున మనలను సూటిగా ప్రశ్నించుచున్నాడు కావున మనం దేవుని వాక్యము విని ఆ ప్రకారము నడుచుకోవాలి,మనజీవితాలను సరిచేసుకోవాలి.
4.నాల్గవధిగా మనం చేయు ప్రతి పనిని పరిశీలన చేసుకోవాలి
గలతీయులకు 6:3 ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును. 4 ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.
ఈరోజున మనం చేయు ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసినవారమైఉన్నము, అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనం అది ఉద్యోగమైన, దేవుని పని ఐన, అది సంఘము యొక్క పని ఐన మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అప్పుడు దేవుడు మనకు ఇచ్చు గొప్ప ఆశీర్వదాలను పొందుకుంటాము.
5.ఐదవదిగా అయన శరిరమనే రొట్టెను తీసుకోనుచున్నపుడు పరిశీలన చేసుకోవాలి
1 కొరింథీయులకు 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
యేసుప్రభువారి శరిరమనే రొట్టెను తీసుకోనునప్పుడు మనం దానికి అర్హులమో కాదో పరిశీలన చేసుకొని సిద్దపడి తీసుకోవాలి.
6.అరవదిగా లేఖనములను పరిశోధించు వారిగా ఉండాలి
అపొస్తలుల కార్యములు 17:11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
ఈరోజున మనం ఎంత వరకు దేవుని వాక్యమును అనుసరిస్తున్నాము, ఎంతవరకు ఈమాటలు మనలను బలపరుస్తున్నాయి,.ఈ లేఖనములలో ఏమి వ్రాయబడినది. ఎంతవరకు మనం దేవుని యెడల విశ్వాసం కలిగి ఉంటున్నమో పరిశీలన చేసుకోవాలి. అది మన జీవితాలకు ఎంతైనా అవసరం.
ఈలోకంలో ఏది యోగ్యమైనది ఏది అయోగ్యమైనది సమస్తమును పరిశీలన చేసుకొని మేలైన దానిని అంగికరించి ఆ ప్రకారము నడచుకోవాలి.
1 థెస్సలొనీకయులకు 5:21ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
ఈరోజున మనం యోబు వలే దేవా నాపాపములు ఎన్ని, నా దోషములు ఎన్ని మాకు తెలియజేయుడి. నా పాపమును హిస్సోపుతో కడుగుము అని అడుగువారిగా ఉండాలి. దేవునిలోను, సమాజములోను ఎలా ఉంటున్నామో మన ప్రవర్తనను గూర్చి, దేవునిలో మనకు ఉన్న విశ్వాసమును బట్టి మనలను మనం పరిశీలన చేసుకోని, మన పాపములను దోషములను ప్రభువు దగ్గర వొప్పుకొని వ్యర్ధమైన వాటిని విడిచి పెట్టి ఆయనను కడుగమని దేవునిలో మరింతగా బలపరచమని అట్టి కృప యేసయ్య మన అందరికి దయచేయాలని ఆశిస్తూ ఆమెన్
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***********************************************************************
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశము: పరిశీలన చేసుకొనుట (Examine Yourself)
2 కొరింథీయులకు 13:5 మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా
చదవబడిన వాక్యములో పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు వ్రాస్తూ ఈ మాటలను పలుకుచున్నట్లుగా మనం చూస్తాం. మనం ఈరోజున ధ్యానించుకోబోయే అంశము ఏమిటి అని అంటే మనలను మనం పరిశీలించుకోనుట, మనలను మనం శోదించుకోనుట., మనలను చూచుకొనుట, ఈ మూడు మాటలు ఒకే అర్ధమును ఇస్తుంది. మనలో చాల మందికి ఇతరులకు ఏదో ఒక విషయం గూర్చి చెప్పాలి అని ఆశ, ఆలోచన కలిగి ఉంటాము, ఐతే పరిశుద్ద గ్రంధము ఏమి చెప్తుంది అని అంటే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు గాని, భోదించేటప్పుడు గాని మనలను మనం ఒకసారి పరిశీలించుకోవాలి అని బైబిల్ గ్రంధం మనకు చెప్తుంది.ఈరోజున మనం ఏ విషయాలలో పరిశీలన చేసుకోవాలో దేవుని వాక్యం మనకు ఏమి చెప్తుందో పరిశుద్ద గ్రంధములో ఏమి వ్రాయబడినదో మనం ధ్యానించుకుందాం
ఈరోజున అంశంను గూర్చి బైబిల్ గ్రంధములో దావీదు పలికిన మాటలను మనం చుస్తే
కీర్తనల గ్రంథము 26:2 యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో ధించుము.
అదేవిధంగా యోబు గారు పలికన మాటలను ఒకసారి మనం ధ్యానిస్తే
యోబు గ్రంథము 13:23 నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
మనలను మనం పరిశీలించుకోవాలి అని యేసుప్రభువారు పలికిన మాటలను మనం చుస్తే
మత్తయి సువార్త 7:1-4 నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? 5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.
మనలో తప్పులు పెట్టుకొని ఇతరుల తప్పులను వెదకు వారిని గూర్చి ఇక్కడ వాక్యంలో చెప్తునట్లుగా మనం చూస్తాం. అలాగే ఒక పాపాత్మురాలైన స్త్రీ ని గూర్చి మీలో ఎవరు పాపము లేనివారో, వారు మొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. ఈరోజున ప్రతి యొక్క వ్యక్తి ప్రతి ఒక్కరు మనం మనలను పరిశీలించుకోవాలి, మన ప్రవర్తనను మనం చూచుకోవాలి, మనం ఎలా మాట్లాడుచున్నమో చూచుకోవాలి, కుటుంభ సభ్యుల విషయంలో ఎలా ఉంటున్నామో మనం చూచుకోవాలి, భర్త-భార్య విషయంలో, భార్య-భర్త విషయంలో ఎలా ఉంటున్నామో చూచుకోవాలి. అలాగే పిల్లలుగా తల్లితండ్రుల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో తమ చదువుల విషయంలో ఎలా ఉంటున్నామో మనం ఎంత వరకు మంచిగా వుంటున్నమో మనం పరిశీలించుకోవాలి, అలాగే ఉద్యోగము చేసే చోట ఇతరులతో మనం ఎలా ఉంటున్నాము అని మనలను మనం పరిశోదించుకోవాలి అని దేవుని వాక్యం మనకు వివరంగా చెప్తుంది.
ఈరోజున మనం ఏ విషయంలలో మనలను మనం పరిశీలన చేసుకోవాలి అని ఆలోచిస్తే
1.మొదటిగా మనం మన ప్రవర్తన ఎలా ఉన్నది అని చూసుకోవాలి
మనం ప్రతి విషయంలో మనలను మనం చూసుకోవాలి,నన్ను నేను పరిశీలనచేసికొంటిని అన్న దావీదు మాటలను మనం జ్ఞాపకం చేసుకొంటే
కీర్తనల గ్రంథము 119:59 నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.
ఇక్కడ మార్గము అనగా మన ప్రవర్తన ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే ముందుగా మనలను మనం పరిశీలన చేసుకోవాలి., ఇది మన జీవితంలో ఎంతైనా అవసరం మరియు ఎంతో ప్రముఖమైన అంశం.
2.రెండవదిగా మన విశ్వాసమును పరిశీలన చేసుకోవాలి
ఈరోజున ప్రియులారా మన విశ్వాస పరిమాణం ఎంత, ఈరోజున దేవునిలో మనకు ఉండవలసిన విశ్వాసం ఎంతో మనం ఆలోచించుకోవాలి. బైబిల్ గ్రంధములో యేసుప్రభువారు విశ్వాసమును గూర్చి పలికినట్లుగా నీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటె ఈ కొండను సముద్రములో పడమనగా నీవు పడద్రోయుదువు అని చెప్పారు, ఈరోజున దేవునిపై మనకు కొండంత విశ్వాసము కలిగినవారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంధములో ఎందరో భక్తులు దేవునిపై వారికి ఉన్నగొప్ప విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు చేయగలిగారు, పేతురును గూర్చి చుస్తే ఆయనకున్న గొప్ప విశ్వాసమును బట్టి నీటి మీద నడవగాలిగాడు. ఆదిమ క్రైస్తవులు విశ్వాసమును బట్టి హింసలు పడ్డారు వారి విశ్వాసమును బట్టి సింహపు బోనులోనికి వెళ్ళి వారి ప్రాణాలను సైతం అర్పించారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, అంతే కాకుండా వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మన విశ్వాసం దేవునిలో ఉన్నదా లేదో మనం పరిశీలన చేసుకోవాలి ఆరీతిగా మనం ఆలోచించుకోవాలి.
ఈరోజున అటువంటి విశ్వాసము కలిగి ఉంటున్నామా మనలో ఏమైనా లోటు ఉన్నదా మనం పరిశీలన చేసుకోవాలి.
రోమీయులకు12:3 తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
3.ముడవదిగా దేవుని వాక్యమును విని ఆ ప్రకారం ప్రవర్తిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి.
యాకోబు 1:23 ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
ప్రియమైన వారలారా ఇక్కడ అద్దము అనగా దేవుని వాక్యం అద్దము అనగా దేవుని సన్నిది, మనం దేవుని సన్నిదిలో మన ప్రవర్తన సరిచేసుకోనుచున్నామా మనలను పరిశీలించుకోవాలి , ఆధ్యాత్మిక సౌందర్యము కలిగి ఉంటున్నామా మనం పరిశీలించుకోవాలి, ఆ వాక్యం విని మనం మారుచున్నామా, మన జీవితంలో మనం ఎంతవరకు సరిచేసుకోనుచున్నాము అని దేవుడు ఈరోజున మనలను సూటిగా ప్రశ్నించుచున్నాడు కావున మనం దేవుని వాక్యము విని ఆ ప్రకారము నడుచుకోవాలి,మనజీవితాలను సరిచేసుకోవాలి.
4.నాల్గవధిగా మనం చేయు ప్రతి పనిని పరిశీలన చేసుకోవాలి
గలతీయులకు 6:3 ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును. 4 ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.
ఈరోజున మనం చేయు ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసినవారమైఉన్నము, అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనం అది ఉద్యోగమైన, దేవుని పని ఐన, అది సంఘము యొక్క పని ఐన మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అప్పుడు దేవుడు మనకు ఇచ్చు గొప్ప ఆశీర్వదాలను పొందుకుంటాము.
5.ఐదవదిగా అయన శరిరమనే రొట్టెను తీసుకోనుచున్నపుడు పరిశీలన చేసుకోవాలి
1 కొరింథీయులకు 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
యేసుప్రభువారి శరిరమనే రొట్టెను తీసుకోనునప్పుడు మనం దానికి అర్హులమో కాదో పరిశీలన చేసుకొని సిద్దపడి తీసుకోవాలి.
6.అరవదిగా లేఖనములను పరిశోధించు వారిగా ఉండాలి
అపొస్తలుల కార్యములు 17:11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
ఈరోజున మనం ఎంత వరకు దేవుని వాక్యమును అనుసరిస్తున్నాము, ఎంతవరకు ఈమాటలు మనలను బలపరుస్తున్నాయి,.ఈ లేఖనములలో ఏమి వ్రాయబడినది. ఎంతవరకు మనం దేవుని యెడల విశ్వాసం కలిగి ఉంటున్నమో పరిశీలన చేసుకోవాలి. అది మన జీవితాలకు ఎంతైనా అవసరం.
ఈలోకంలో ఏది యోగ్యమైనది ఏది అయోగ్యమైనది సమస్తమును పరిశీలన చేసుకొని మేలైన దానిని అంగికరించి ఆ ప్రకారము నడచుకోవాలి.
1 థెస్సలొనీకయులకు 5:21ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
ఈరోజున మనం యోబు వలే దేవా నాపాపములు ఎన్ని, నా దోషములు ఎన్ని మాకు తెలియజేయుడి. నా పాపమును హిస్సోపుతో కడుగుము అని అడుగువారిగా ఉండాలి. దేవునిలోను, సమాజములోను ఎలా ఉంటున్నామో మన ప్రవర్తనను గూర్చి, దేవునిలో మనకు ఉన్న విశ్వాసమును బట్టి మనలను మనం పరిశీలన చేసుకోని, మన పాపములను దోషములను ప్రభువు దగ్గర వొప్పుకొని వ్యర్ధమైన వాటిని విడిచి పెట్టి ఆయనను కడుగమని దేవునిలో మరింతగా బలపరచమని అట్టి కృప యేసయ్య మన అందరికి దయచేయాలని ఆశిస్తూ ఆమెన్
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***********************************************************************
24May2020
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం: హత్తుకోనుట
రోమీయులకు 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
చదవబడిన వాక్యభాగాములో మనం హత్తుకొని యుండుడి అను ఒక మాటను గూర్చి మనం ఈరోజున ధ్యానము చేసుకుందాము. ఇది చాల లోతైనటువంటి మాట, అర్దవంతమైనటువంటి మాట. సాదారణముగా హత్తుకొనుట అనగా బైబిల్ గ్రంధములో అనేక చోట, అనేక రకములుగా వ్రాయబడినది. హత్తుకొనుట అనగా అంటుకొనుట, దగ్గరకు చేరుట అని కుడా అర్ధం ఇస్తుంది కీర్తనాకారుడు అంటాడు నాలుక నా దవడను అంటుకొనియున్నది అలాగే నాఎముకలు నా దేహమును అంటుకొనియున్నవి అని ఇంకా అనేక విధాలుగా హత్తుకొనియున్నవి అని పలికినట్లుగా మనము చూస్తాం.
ఈరోజున ఎవరు ఎవరిని హత్తుకోవాలి అని మనం చుస్తే, మన జీవితంలో, అనేక సందర్బాలలో ఈ హత్తుకొని ఉండుట, అనేకులను మన దగ్గరకు చేర్చుకొనియుండుటను ఈ లోకంలో మనం గమనించవచ్చు. కానీ ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి? మనం ఏవిషయంలలో దేనిని హత్తుకొని జీవించాలి? కొన్ని అంశాలను మనం ఈరోజున ధ్యానించుకుందాము.
1. మొదటిగా మనం శిరస్సును హత్తుకొని జీవించాలి.
కొలొస్సయులకు 2:19 శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
శిరస్సు అనగా ఏమిటి? శిరస్సు అనగా ఎవరు? అని మనం ఆలోచిస్తే ఈలోకంలో మన శరీరమునకు ఈ శిరస్సు ఎంత ప్రాముఖ్యమో అలాగే మన ఆధ్యాత్మిక జీవితానికి యేసుప్రభువారు మనకు శిరస్సుగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనం ఆయనను హత్తుకొని, ప్రేమించి, ఆయనతో ఏకామై, ఏమి ఉన్న ఏమి లేకపోయినా అయనను కలిగి మనం జీవించాలి. అప్పుడు మన జీవితం ఆశీర్వదాలకు కారణం అవుతుంది. అటువంటి గొప్ప బహుమానంను కలిగి ఆయనను హత్తుకొని మనం ఈలోకంలో జీవించాలి. మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఈరోజున మనం ఎంతగా ఆయనను హత్తుకొని ఉంటున్నాము ఆలోచించుకోవాలి. ఇక్కడ హత్తుకోనుట అనగా ఆయనను ప్రేమించడం, హత్తుకోనుట అంటే అయన వాక్యానుసారంగా జీవించడం. ఆయనతో ప్రార్దన ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఆయనతో సహవాసం చేయడం. అలాగున క్రీస్తును మనం కలిగి, క్రీస్తుతో కలిసి జీవించాలి. మనం దేనిని హత్తుకోని జీవిస్తున్నాము? ప్రియులారా మనమైతే దేవుని హత్తుకోని జీవించాలి.మన యేసయ్యను అయన భోదలను హత్తుకొని జీవించాలి.
2.రెండవదిగా తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే మనం యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొని జీవించాలి.
సమూయేలు 26:19 రాజా నా యేలిన వాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారునీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయు చున్నారు.
ఏమిటి ఈ స్వాస్థ్యము? ఏది యెహోవా స్వాస్థ్యము? అనగా ఇశ్రాయేలీయుల ప్రజలే అయన స్వాస్థ్యము. దేవుని చేత ఏర్పాటుచేయబడిన దేవుని ప్రజలే దేవుని యొక్క స్వాస్థ్యము. దేవుని చేత పంపబడిన ప్రవక్తలే దేవుని యొక్క స్వాస్థ్యం. అంతేకాకుండా దేవుని చేత బలంగా వాడబడుచున్న వారే దేవుని స్వాస్థ్యము. ఈరోజున నీవు, నేనే దేవుని యొక్క స్వాస్థ్యము. దావీదు దేవుడు బలపరుస్తున్న ఇశ్రాయేలీయుల జనులను విడిపించాడు ఎందుకు అని అంటే వారే దేవుని స్వాస్థ్యము. ఈరోజున మనం దేవుని బిడ్డలుగా దేవుని హత్తుకోనుచున్నమా, సంఘమును ప్రేమిస్తున్నమా, సంఘమును హత్తుకోనుచున్నమా, సంఘమును ద్వేషిస్తున్నమా ఆలోచించుకోవాలి. ఈరోజున మనం కుడా దేవుని స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడ్డాము. దావీదు దేవుని బిడ్డలైన ప్రేమించి వారిని హత్తుకొని కాపాడుటకు వెనుకాడలేదు. ఈరోజున మనం దేవుని సంఘమును, దేవుని చేత ఏర్పాటుచేయబడిన అయన సేవకులను హత్తుకొని జీవించాలి., దేవుని అశీర్వాదాలను పొందుకోవాలి.
3.మూడవదిగా అయన జీవమును హత్తుకోవాలి.
ద్వితీయోపదేశకాండము30:20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.
మోషే తన ప్రజలతో అంటాడు నేడు దేవుడు మనకు “జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను” అని చెప్తున్నాడు. ఈరోజున మనం జీవము కావాలి అని కోరుకుంటామా, మరణము కావాలి అని కోరుకుంటామా, ఆశీర్వాదమును కోరుకుంటామా, లేక శాపమును కావాలి అని కోరుకుంటామా. మనమైతే ఆశీర్వాదము కావాలి అని కోరుకుంటాము అంటే మనం అయన జీవమును కావాలి అని కోరుకోవాలి. అనగా జీవమును హత్తుకోవాలి. ఎక్కడ ఉంది ఈ జీవం అని మనం ఆలోచిస్తే దేవునిలో ఉంది జీవం. దేవుని సన్నిదిలో ఉంది ఈ జీవం. చీకటి మరణమునకు సూచన, వెలుగు జీవమునకు సూచన., అటువంటి నిత్య జీవమును మనం కోరుకోవాలి. అటువంటి జీవము గల దేవుని హత్తుకొని మనం జీవించాలి, అటువంటి జీవము మన యేసుప్రభువారు. ఈరోజున మనం దేనిని హత్తుకోనుచున్నాము. ఈలోకమునా, ఉద్యోగామునా, ధనమునా కాదుగాని మనం మన ప్రభువైన యేసుప్రభువారిని ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించాలి ప్రభువు యొక్క అశీర్వాదాలను పొందుకోవాలి.
4. నాల్గవదిగా దేవుని మనం శాసనములను హత్తుకొని జీవించాలి.
కీర్తనల గ్రంథము 119:31 యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.
దావీదు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అంటే కారణం అయన దేవుని యొక్క శాసనములను హత్తుకొన్నాడు, అయన దేవుని వాక్యమును ప్రేమించాడు మరియు ఎంతగానో ఇష్టపడ్డాడు, దేవుని వాక్యమును ఆశతో స్వీకరించాడు, వాటిని అనుసరించాడు. ఈరోజున మనం ప్రభువా నీ మాటలతో మాట్లాడు అని ప్రార్దించాలి, వాటి ద్వారా ఆయనలో బలబడాలి, బంగారము కంటే వజ్రముకంటే అమూల్యమైన, విలువైన వాక్యమును ధ్యానించి, స్వీకరించి ఆయనను అనుసరించి జీవించే గొప్ప భాగ్యం కావాలి అని ప్రార్దించాలి.
5.ఐదవదిగా మనం మంచిదానిని హత్తుకొని జీవించాలి.
రోమీయులకు12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
ఈలోక సంబందముగా మనం ఎలాగైతే మంచి వాటిని తీసుకోని, చెడ్డవి వదలిపెడతామో, అదేవిధంగా దైవసంభందముగా చేడును విడిచి, మంచిని అనుసరించాలి. ఈరోజున మనం దేనిని హత్తుకొని జీవిస్తున్నాము, మనమైతే శరీరకార్యములలో చెడ్డదాని నసహ్యించుకొని వాటిని విడిచి, గొప్పవైన ఆత్మఫలములు పొందుకోవాలి. ఈరోజున మనకు ఏది మంచిది? అని ఆలోచిస్తే "మంచిది దేవుని వాక్యం" ధ్యానించండి, "మంచిది దేవుని సన్నిది" అలయక ఆశ్రయించండి, "మంచిది ప్రార్దన" విసుగాక చేయండి, "మంచి పనులు చేయడం" విశ్వాసంతో బ్రతకడం మేలుకరమైనది చేయడం మంచిది. కోపము, ద్వేషమును విడిచిపెట్టాలి, మంచిని హత్తుకొని జీవించాలి, దేవుని అశీర్వాదాలను పొందుకోవాలి.
6. స్థిరహృదయముతో ప్రభువును హత్తుకొని జీవించాలి.
అపొస్తలుల కార్యములు 11:23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
7. విశ్వాసమును హత్తుకొని జీవించాలి.
అపొస్తలుల కార్యములు 17:34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.
ముగింపు:- ఈరోజున మనకు శిరస్సుగా ఉన్న మన రక్షకుని హత్తుకొని మనం జీవించాలి, యెహోవా స్వాస్థ్యమును, అయన మనకు ఇచ్చు జీవమును, అయన వాక్యము అను శాసనములను హత్తుకొని జీవించాలి, చెడ్డ దానిని విడిచి, మంచి దానిని హత్తుకొని, స్థిరహృదయముతో, ప్రార్ధనతో ప్రభువు యందు గొప్ప విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని సంఘమును, దేవుని సేవకులను ప్రేమించి ఆధ్యాత్మికంగా,ఆత్మీయంగా ఫలించాలి ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
*********************************************************************************
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం: హత్తుకోనుట
రోమీయులకు 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
చదవబడిన వాక్యభాగాములో మనం హత్తుకొని యుండుడి అను ఒక మాటను గూర్చి మనం ఈరోజున ధ్యానము చేసుకుందాము. ఇది చాల లోతైనటువంటి మాట, అర్దవంతమైనటువంటి మాట. సాదారణముగా హత్తుకొనుట అనగా బైబిల్ గ్రంధములో అనేక చోట, అనేక రకములుగా వ్రాయబడినది. హత్తుకొనుట అనగా అంటుకొనుట, దగ్గరకు చేరుట అని కుడా అర్ధం ఇస్తుంది కీర్తనాకారుడు అంటాడు నాలుక నా దవడను అంటుకొనియున్నది అలాగే నాఎముకలు నా దేహమును అంటుకొనియున్నవి అని ఇంకా అనేక విధాలుగా హత్తుకొనియున్నవి అని పలికినట్లుగా మనము చూస్తాం.
ఈరోజున ఎవరు ఎవరిని హత్తుకోవాలి అని మనం చుస్తే, మన జీవితంలో, అనేక సందర్బాలలో ఈ హత్తుకొని ఉండుట, అనేకులను మన దగ్గరకు చేర్చుకొనియుండుటను ఈ లోకంలో మనం గమనించవచ్చు. కానీ ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి? మనం ఏవిషయంలలో దేనిని హత్తుకొని జీవించాలి? కొన్ని అంశాలను మనం ఈరోజున ధ్యానించుకుందాము.
1. మొదటిగా మనం శిరస్సును హత్తుకొని జీవించాలి.
కొలొస్సయులకు 2:19 శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
శిరస్సు అనగా ఏమిటి? శిరస్సు అనగా ఎవరు? అని మనం ఆలోచిస్తే ఈలోకంలో మన శరీరమునకు ఈ శిరస్సు ఎంత ప్రాముఖ్యమో అలాగే మన ఆధ్యాత్మిక జీవితానికి యేసుప్రభువారు మనకు శిరస్సుగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనం ఆయనను హత్తుకొని, ప్రేమించి, ఆయనతో ఏకామై, ఏమి ఉన్న ఏమి లేకపోయినా అయనను కలిగి మనం జీవించాలి. అప్పుడు మన జీవితం ఆశీర్వదాలకు కారణం అవుతుంది. అటువంటి గొప్ప బహుమానంను కలిగి ఆయనను హత్తుకొని మనం ఈలోకంలో జీవించాలి. మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఈరోజున మనం ఎంతగా ఆయనను హత్తుకొని ఉంటున్నాము ఆలోచించుకోవాలి. ఇక్కడ హత్తుకోనుట అనగా ఆయనను ప్రేమించడం, హత్తుకోనుట అంటే అయన వాక్యానుసారంగా జీవించడం. ఆయనతో ప్రార్దన ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఆయనతో సహవాసం చేయడం. అలాగున క్రీస్తును మనం కలిగి, క్రీస్తుతో కలిసి జీవించాలి. మనం దేనిని హత్తుకోని జీవిస్తున్నాము? ప్రియులారా మనమైతే దేవుని హత్తుకోని జీవించాలి.మన యేసయ్యను అయన భోదలను హత్తుకొని జీవించాలి.
2.రెండవదిగా తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే మనం యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొని జీవించాలి.
సమూయేలు 26:19 రాజా నా యేలిన వాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారునీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయు చున్నారు.
ఏమిటి ఈ స్వాస్థ్యము? ఏది యెహోవా స్వాస్థ్యము? అనగా ఇశ్రాయేలీయుల ప్రజలే అయన స్వాస్థ్యము. దేవుని చేత ఏర్పాటుచేయబడిన దేవుని ప్రజలే దేవుని యొక్క స్వాస్థ్యము. దేవుని చేత పంపబడిన ప్రవక్తలే దేవుని యొక్క స్వాస్థ్యం. అంతేకాకుండా దేవుని చేత బలంగా వాడబడుచున్న వారే దేవుని స్వాస్థ్యము. ఈరోజున నీవు, నేనే దేవుని యొక్క స్వాస్థ్యము. దావీదు దేవుడు బలపరుస్తున్న ఇశ్రాయేలీయుల జనులను విడిపించాడు ఎందుకు అని అంటే వారే దేవుని స్వాస్థ్యము. ఈరోజున మనం దేవుని బిడ్డలుగా దేవుని హత్తుకోనుచున్నమా, సంఘమును ప్రేమిస్తున్నమా, సంఘమును హత్తుకోనుచున్నమా, సంఘమును ద్వేషిస్తున్నమా ఆలోచించుకోవాలి. ఈరోజున మనం కుడా దేవుని స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడ్డాము. దావీదు దేవుని బిడ్డలైన ప్రేమించి వారిని హత్తుకొని కాపాడుటకు వెనుకాడలేదు. ఈరోజున మనం దేవుని సంఘమును, దేవుని చేత ఏర్పాటుచేయబడిన అయన సేవకులను హత్తుకొని జీవించాలి., దేవుని అశీర్వాదాలను పొందుకోవాలి.
3.మూడవదిగా అయన జీవమును హత్తుకోవాలి.
ద్వితీయోపదేశకాండము30:20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.
మోషే తన ప్రజలతో అంటాడు నేడు దేవుడు మనకు “జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను” అని చెప్తున్నాడు. ఈరోజున మనం జీవము కావాలి అని కోరుకుంటామా, మరణము కావాలి అని కోరుకుంటామా, ఆశీర్వాదమును కోరుకుంటామా, లేక శాపమును కావాలి అని కోరుకుంటామా. మనమైతే ఆశీర్వాదము కావాలి అని కోరుకుంటాము అంటే మనం అయన జీవమును కావాలి అని కోరుకోవాలి. అనగా జీవమును హత్తుకోవాలి. ఎక్కడ ఉంది ఈ జీవం అని మనం ఆలోచిస్తే దేవునిలో ఉంది జీవం. దేవుని సన్నిదిలో ఉంది ఈ జీవం. చీకటి మరణమునకు సూచన, వెలుగు జీవమునకు సూచన., అటువంటి నిత్య జీవమును మనం కోరుకోవాలి. అటువంటి జీవము గల దేవుని హత్తుకొని మనం జీవించాలి, అటువంటి జీవము మన యేసుప్రభువారు. ఈరోజున మనం దేనిని హత్తుకోనుచున్నాము. ఈలోకమునా, ఉద్యోగామునా, ధనమునా కాదుగాని మనం మన ప్రభువైన యేసుప్రభువారిని ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించాలి ప్రభువు యొక్క అశీర్వాదాలను పొందుకోవాలి.
4. నాల్గవదిగా దేవుని మనం శాసనములను హత్తుకొని జీవించాలి.
కీర్తనల గ్రంథము 119:31 యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.
దావీదు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అంటే కారణం అయన దేవుని యొక్క శాసనములను హత్తుకొన్నాడు, అయన దేవుని వాక్యమును ప్రేమించాడు మరియు ఎంతగానో ఇష్టపడ్డాడు, దేవుని వాక్యమును ఆశతో స్వీకరించాడు, వాటిని అనుసరించాడు. ఈరోజున మనం ప్రభువా నీ మాటలతో మాట్లాడు అని ప్రార్దించాలి, వాటి ద్వారా ఆయనలో బలబడాలి, బంగారము కంటే వజ్రముకంటే అమూల్యమైన, విలువైన వాక్యమును ధ్యానించి, స్వీకరించి ఆయనను అనుసరించి జీవించే గొప్ప భాగ్యం కావాలి అని ప్రార్దించాలి.
5.ఐదవదిగా మనం మంచిదానిని హత్తుకొని జీవించాలి.
రోమీయులకు12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
ఈలోక సంబందముగా మనం ఎలాగైతే మంచి వాటిని తీసుకోని, చెడ్డవి వదలిపెడతామో, అదేవిధంగా దైవసంభందముగా చేడును విడిచి, మంచిని అనుసరించాలి. ఈరోజున మనం దేనిని హత్తుకొని జీవిస్తున్నాము, మనమైతే శరీరకార్యములలో చెడ్డదాని నసహ్యించుకొని వాటిని విడిచి, గొప్పవైన ఆత్మఫలములు పొందుకోవాలి. ఈరోజున మనకు ఏది మంచిది? అని ఆలోచిస్తే "మంచిది దేవుని వాక్యం" ధ్యానించండి, "మంచిది దేవుని సన్నిది" అలయక ఆశ్రయించండి, "మంచిది ప్రార్దన" విసుగాక చేయండి, "మంచి పనులు చేయడం" విశ్వాసంతో బ్రతకడం మేలుకరమైనది చేయడం మంచిది. కోపము, ద్వేషమును విడిచిపెట్టాలి, మంచిని హత్తుకొని జీవించాలి, దేవుని అశీర్వాదాలను పొందుకోవాలి.
6. స్థిరహృదయముతో ప్రభువును హత్తుకొని జీవించాలి.
అపొస్తలుల కార్యములు 11:23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
7. విశ్వాసమును హత్తుకొని జీవించాలి.
అపొస్తలుల కార్యములు 17:34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.
ముగింపు:- ఈరోజున మనకు శిరస్సుగా ఉన్న మన రక్షకుని హత్తుకొని మనం జీవించాలి, యెహోవా స్వాస్థ్యమును, అయన మనకు ఇచ్చు జీవమును, అయన వాక్యము అను శాసనములను హత్తుకొని జీవించాలి, చెడ్డ దానిని విడిచి, మంచి దానిని హత్తుకొని, స్థిరహృదయముతో, ప్రార్ధనతో ప్రభువు యందు గొప్ప విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని సంఘమును, దేవుని సేవకులను ప్రేమించి ఆధ్యాత్మికంగా,ఆత్మీయంగా ఫలించాలి ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
*********************************************************************************
31May2020
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం:దూరముగా ఉండుము(stay far away)
తీతుకు3:9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
చదవబడిన వాక్యములో ఒక మాట మనకు కనిపిస్తుంది అది ఏమిటి అని అంటే దూరముగా ఉండుము. ఈరోజున అంశము దూరముగా ఉండుము, చాల సందర్బములలో దూరముగా ఉండుట వలన కొన్ని లాభాలు, అలాగున నష్టాలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. కుటుంభానికి దూరముగా దూరప్రదేశాలలో ఉన్న వారికీ దూరముగా ఉండుట అనునది చాల కష్టమైనది. ఈరోజున అంశంలో మనం ఎవరికి దూరముగా ఉండాలి, ఎవరికీ దగ్గరగా ఉండాలి, దేవుని దృష్టిలో ఎవరు దేవునికి దూరస్తులు పరిశుద్దమైన దేవుని గ్రంధము ఏమి చెప్తుంది ఈరోజున మనం ధ్యానించుకుందాం.
ఈరోజున ఎవరు దేవునికి దూరస్తులు ఎవరు సమీపస్తులు అని మనం ఆలోచిస్తే
యెషయా గ్రంథము 33:13 దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.
ఎవరు దేవునికి సమీపస్తులు అని అంటే దేవుని ఎరిగినటువంటి వారు దేవునికి దగ్గరగా ఉండే బిడ్డలు ఆయనకు సమీపస్థులు, మరి ఎవరు ఆయనకు దూరస్తులు అని అంటే అన్యజనులైనటువంటివారు దేవునికి దూరముగా ఉన్నటువంటివారు ఆయనకు దూరస్థులు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది.
ఈరోజున మనం దేవునికి దూరంగా ఉంటున్నామా, దేవుని దగ్గరగా ఉంటున్నామా మనలను మనం పరిశీలించుకోవలసినవరమై ఉన్నాము
అందుకే పరిశుద్ద దేవుని వాక్యంలో దావీదు అంటాడు.
కీర్తనల గ్రంథము 22:11 శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడునాకు దూరముగా నుండకుము.
దేవుడు మనకు దూరముగా ఉండకుండా., ప్రభువా నాకు దూరముగా ఉండకుము, నాకు సమీపముగా ఉండుము అని నిత్యమూ మనం ఆయనకు ప్రార్ధన చేయవలసినవారమై ఉన్నాము. సముయేలు దేవుని అంటిపెట్టుకొని ఉండినట్లుగా దేవుని మాటలను వినే వాడిగా మనం చూస్తాం.
మనుష్యులుగా దేవుని బిడ్డలుగా ఈరోజున మనం దేనికి దూరముగా ఉండాలి, మన జీవితంలో ఏ ఏ విషయాలకు మనం దూరముగా ఉండాలి దేవుని వాక్యం ఏమి చెప్తుంది అని మనం ఆలోచిస్తే
1.మొదటిగా అబద్ధమునకు దూరముగా నుండుము
నిర్గమకాండము 23:7 అబద్ధమునకు దూరముగానుండుము; నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.
మన జీవితంలో మనం ప్రతి విషయంలో యదార్ధత కలిగి ఉండాలి, అబద్ధమునకు దూరముగా ఉండాలి, ఎందుకు అని అంటే ఇది చాల ప్రమాదకరమైనది.
2.రెండవదిగా కీడునకు దూరముగా ఉండుడి.
1 థెస్సలొనీకయులకు5: 22 ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
పాపులు నిన్ను కీడు చేయుటకు పురిగోలిపితే నీవు వారి మాట వినకుము అని దేవుని మాట చెప్తుంది, దేవుని బిడ్డలుగా మనం ఈరొజున కీడు చేయుటకు దూరముగా ఉండాలి, కీడు చేయువారికి దూరముగా ఉండాలి.
3.ముడవదిగా జారత్వమునకు దూరముగా ఉండుము.
1థెస్సలొనీకయులకు 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
దేవుని బిడ్డలుగా మనం జారత్వమునకు ఉండాలి. ప్రాముఖ్యముగా అనేకమైన ఆకర్షణలు యవ్వన బిడ్డలను ప్రేరేపిస్తూ ఉంటాయి, కానీ వాటికీ దూరముగా ఉండాలి, ఎందుకు అని అంటే సంసోను గూర్చి మనం చుస్తే ఒక జారస్త్రికి లోబడుట వలన ఎటువంటి దుస్తితి ఆయనకు వచ్చిందో మనకు తెలుసు. ఒక జారాస్త్రి వలన తన బలమును కోల్పోయాడు దేవుడు ఎక్కడ తనకు బలము ఇచ్చాడో, ఆక్కడే తన బలమును కోల్పోయాడు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. అందుకే యవ్వనస్తులరా జారత్వమునకు దూరముగా ఉండుము నీ యవ్వనమును కాపాడుకోనుము అని దేవుని వాక్యం చెప్తుంది.
4.నాల్గావదిగా అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా ఉండుము.
1 తిమోతికి 6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.
ఈరోజున చాల మంది అనవసరమైన వాటిని గూర్చి మాట్లాడుచుంటారు వాటి వాళ్ళ ఏమిటి నష్టం అని అంటే అనర్దాలు, విబేదాలు ఏర్పడుతాయి. అందుకే వ్యర్ధమైన, అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా ఉండాలి. మన జీవితానికి మన కుటుంబానికి పనికొచ్చే మాటలు పలికే వారిగా ఉండాలి ఇది మన జీవితాలకు మంచిది.
5. ఐదవదిగా అవివేకతర్కములకు దూరముగా ఉండుడి
తీతుకు3:9 అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
ఈరోజున మనం ప్రయోజనములేని అవివేక తర్కములకు దూరముగా ఉండాలి, అని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి తర్కము చేసేవారు తాను నమ్మిన సిద్దతాంతము గొప్పది అని వాదిస్తాడు. ఇవన్ని వ్యర్ధము, ఎటువంటి ప్రయోజనము లేనివి, ఇవన్ని విశ్వాసులను గలిబిలి చేసేవి. మనం ఏమిటి చేయాలి అని అంటే యేసుప్రభువారు చెప్పినట్లుగా ఒక పాపిని రక్షించాలి, దేవునిలో నడిపించాలి అట్టి రీతిగా ప్రయత్నించాలి.
6.ప్రియులారా ఈరోజున మనం దేనికి దగ్గరగా ఉండాలి, దేనికి దూరముగా ఉన్నాము అని మనలను ప్రశ్నించుకొంటే మన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి.
యెషయా గ్రంథము 29:13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.
ముగింపు: ప్రియులారా ఈరోజున మనం దేవుని బిడ్డలుగా దేవునికి సమీపముగా ఉండాలి, లోకానికి దూరముగా ఉండు వారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం అబద్ధమునకు దూరముగా ఉండాలి., జారత్వమునకు, కీడునకు దూరముగా ఉండాలి. అపవిత్రమైన వట్టి మాటలకు, అవివేక-తర్కములకు దూరముగా ఉండి మన హృదయమును దేవునికి దగ్గరగా ఉంచి ప్రార్ధనలో, దేవుని వాక్యములో, దేవునిలో బలపడి, ఇతరులను దేవునిలోనికి నడిపించువారిగా ఉండాలి., దేవుని కృప అందరికి కలుగును గాక ఆమెన్.
యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
1 comment:
Praise the Lord, we blessed with word of God 🙏
Post a Comment