05July2020
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : మాకేమి దొరకును
మత్తయి సువార్త 19:27 పేతురుఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా
చదవబడిన వాక్యములో యేసుప్రభువారిని అయన శిష్యులైనవారు ఆయన్ను వెంబడిస్తే మాకేమి దొరకును అని అడుగుచున్న ఒక మాట మనకు కనిపిస్తుంది. మానవ పాపపరిహారం కొరకు లోక రక్షకుడు వస్తాడు అయన మనలను రక్షిస్తాడు అని బాప్తిస్మము ఇచ్చు యోహాను ప్రకటిస్తూ అనేకమందిని సిద్దపరచినవాడు. యేసుప్రభువారు మీరు నా వెంబడి రండి మిమ్మలిని మనుష్యులను పట్టు జలారులుగా చేస్తాను అని చెప్పారు. మన కొరకు వచ్చిన గొప్ప దేవుడు మన యేసుప్రభువారు. ఇక్కడ వాక్య సందర్భములో పేతురు గారు యేసుప్రభువారిని మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగుచున్నట్లుగా మనం చూడవచ్చు.
ఈ కాలంలో అనేకమంది నుండి ఇటువంటి ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది.
నిన్ను వెంబడిస్తున్నాము మాకు ఏమి ప్రయోజనం అని అనుకున్నవారు, అలాంటి ఆలోచనతో ఈరోజున అనేకమంది జీవిస్తున్నారు. అయన ద్వార ఏదైనా ఒక అవసరత, వారి యొక్క కోరిక, వారి సమస్యలు నెరవేర్చుకొనుటకు ఆయనను వెంబడిస్తున్నారు, అయన ఇచ్చిన వాగ్దనములు నెరవేర్చినవాడు, అయన అందరికి న్యాయము చేయువాడు. ఇంకా అనేక మంది ఆయనను నమ్ముకోన్నవారు ఉన్నారు. దేవుడు మనకు ఎంతో మేలులు చేయువాడు.
అందుకే దేవుడు మానవుల కొరకు ఎంతో మేలు సిద్దపరచాడు అని కీర్తనకరుడు అంటాడు.
కీర్తనల గ్రంథము 31:19 నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
మనలను సృజించిన పరమ తండ్రికి ఎవరికీ ఎప్పుడు ఎలా ఇవ్వాలో మన దేవునికి తెలుసు, ఎందుకు అని అంటే అయన మన కొరకు అనేకమైన వాటిని సిద్దపరచువాడు. కనుక ఆయనను ఎవ్వరును నిందించరాదు. మనం చేయవలసినది ఏమిటి అని అంటే దేవుని వాగ్దనములు నేరవేర్పు కొరకు కనిపెట్టాలి, అందుకు మనం ఎలా ఉండాలి అని అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
ఈరోజున మనం ధ్యానించు కోబోయే అంశం మాకేమి దొరుకును, దేవుడు మనం ఆయనను వెంబడిస్తే అయన మనకు ఏమి ఇస్తాడు, దేవుని వాక్యం మనకు ఏమి చెప్తుంది అని మనం ఈరోజున ధ్యానించుకొందాము.
1.మొదటిగా ఆయనను వెంబడిస్తే మనకు ఏమి దోరుకుతుంది అని అంటే దేవుని రాజ్యమును అయన సిద్దపరుస్తాడు
మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
సమస్తమును విడిచి ఆయనను వెంబడిస్తే మనకు ఏమి దొరుకుతుంది అని అంటే "దేవుని రాజ్యము" మనకు దొరుకుతుంది, ప్రియులారా దేవుని రాజ్యము అముల్యమైనది, ఈ లోకరాజ్యాలు వేరు, నా రాజ్యము వేరు అని యేసుప్రభువారు పిలాతుతో అన్నారు. ఈ లోకరాజ్యాలు అన్యాయము అసూయతో నిండినవి, పగలతో, కష్టాలతో నిండినవి, కానీ మన దేవుని రాజ్యము నిత్యమూ వేలుగైనటువంటిది, ఇది శాస్వత నీతి, న్యాయములు కలిగినటువంటిది, అది చిరకాలము శాశ్వతమైనది అటువంటి దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకొంటాము.
ఎప్పుడు మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొంటాము అని ఆలోచిస్తే
అవసరమైతే అన్ని విడిచి దేవుని కంటే ఎక్కువగా దేనిని తలంచక, దేవుని యెడల భయ భక్తులు కలిగి మనము అయన చేతుల క్రింద దీనమనస్కులై ఉండాలి. అప్పుడు మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొంటాము. మనము అయన చేత ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి, గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియుండాలి అప్పుడు మనము అయన రాజ్యమును స్వతంత్రించుకొంటాము.
అసలు ఎవరు అయన రాజ్యము అని మనం చుస్తే
ప్రకటన గ్రంథము 5:10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
మనమే అయన రాజ్యము అని దేవుని వాక్యం చెప్తుంది, మనలను ఎవరైనా అడిగితే మనము రాజులము దేవుని చేత ఏర్పాటుచేయబడిన వారము అని చెప్పాలి.
కనుక మనము ఎవరము, మనము ఎలా జీవించాలి అని ఆలోచిస్తే
1పేతురు 2:9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సముహము పరిశుద్ద జనమును దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
దేవుని వాక్యము చెప్తుంది మనము అయన నామమును ప్రచురించే అయన బిడ్డలము, రాజులైన యాజక సముహము, పరిశుద్ద జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము, కనుక మనము ఎలా జీవించాలి అని అంటే అయన సొత్తైన ప్రజలై అయన యందు భయభక్తులు కలిగి నిత్యమూ జీవించాలి.
అందుకు దేవుడు మనలను ఒక రాజ్యముగాను యాజకులనుగాను ఎలా చేసాడు.
ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
దేవుడు మనలను ఒక రాజ్యముగాను యాజకులనుగాను ఎలా చేసాడు అని అంటే యేసుప్రభువారి తన రక్తము చిందించుట వలన మన పాపముల నుండి మనలను విడిపించి మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా పరలోక యజాకులుగా చేసాడు. మనము పరలో రాజులము.
2.రెండవదిగా ఆయనను వెంబడిస్తే మనకు ఏమి దోరుకుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో కూర్చొనే ధన్యత ఇస్తాను అని చెప్తున్నారు
ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
యేసుప్రభువారు అయన ఈ లోకమును జయించారు, అందుకే అయన ఈరోజున మనకు ఏమి చెప్తున్నారు అని అంటే అయన వలే మనము కూడా ఈ లోకమును జయించే వారిగా ఉంటె మనకు ఆయనతో కూర్చునే ధన్యత ఇస్తాను అని చెప్తున్నారు. దేవుని సింహాసనమునందు కూర్చుండియున్న భాగ్యము మనకు యేసుప్రభువారు ఇస్తారు.
మనకు ఎటువంటి భాగ్యము కలుగుతుంది అని అంటే
మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.
అటువంటి భాగ్యము మనకు కావాలి అని అంటే మానవ శక్తి చాలదు మనము ఆత్మ చేత నింపబడి పరిశుద్ద ఆత్మ శక్తిని పొందుకోవాలి. అప్పుడు శాశ్వతమైన అయన సింహాసనము ఎదుట ఉండే భాగ్యము కలుగుతుంది.
అటువంటి ఆత్మ శక్తిని పొందుకోవడానికి మనము ఏమిచేయాలి
మత్తయి 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
3. ముడవదిగా మనము ఆయనను వెంబడిస్తే ఏమి పొందుకుంటాము అని అంటే జనుల మీద అధికారము ఇచ్చెదను అని చెప్తున్నారు.
ప్రకటన గ్రంథము 2:26 నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
ఈలోకంలో అదికారము కొరకు ప్రాకులాడు వారు అనేకమంది ఉన్నారు, కానీ ఇక్కడ దేవుని వాక్యములో అదికారము అంటే ఈ లోక అదికారము కాదు గాని శాశ్వతమైన దేవుని రాజ్య అదికారము, దానికి మనము పరలోకము చేరాలి, అయన సింహాసనము ఎదుట నిలువబడాలి. అయన ఇచ్చు అధికారము పొందుకోవాలి.
అటువంటి దేవుడు ఇచ్చు అధికారము పొందుకోవాలి అని అంటే మనము ఏ గుంపులో ఉండాలి.
1 కొరింథీ 6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరె రుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్ప మైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?
అటువంటి దేవుడు ఇచ్చు అధికారము పొందుకోవాలి అని అంటే మనము పరిశుద్దుల గుంపులో ఉండాలి. రాజులైన యాజక సమూహములో ఉండాలి. అప్పుడు జనుల మీద తీర్పు తీర్చు అధికారము కలిగిన అధికారులుగా మనం ఈరోజున ఉండాలి.
ఈలోకరాజ్యములు శాశ్వతములు కాదు, ఈ లోక సింహాసనములు శాశ్వతము కాదు , ఈలోక అధికారము శాశ్వతము కాదు గాని, శాశ్వతమైనది ఒక్కటే అది దేవుని రాజ్యము -దేవునితో ఉండే భాగ్యము, దేవుని సింహాసనము. అట్టి భాగ్యము - ప్రభువు కృప మన అందరికి అందించును గాక ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
***************************************************
19July2020
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం: నా యెద్ద కొనుడి
ప్రకటన గ్రంథము 3:18 నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
చదవబడిన దేవుని వాక్యములో యేసు క్రీస్తు ప్రభువారు అయన కొన్ని వస్తువులను అయన నా యెద్ద కొనుమని చెప్తున్నారు? అయన దగ్గర అన్ని ఉచితమే ఐన కానీ ఇక్కడ అయన కొన్ని వస్తువులను అయన నా యెద్ద కొనుమని ఎవరికీ చెప్తున్నారు అని ఆలోచిస్తే? ఎవరిని అయన కొనమని చెప్తున్నారు అని అంటే ఏడు సంఘములలో ఒకటి ఐన లవోదికియ అనే సంఘమునకు చెప్తున్నారు. లవోదికియ అను పట్టణము చాల ప్రసిద్ది చెందినది, చాల ధనము కలిగినటువంటిది, చాల సంపాదన కలిగినటువంటి ఒక పట్టణము. ఈ లవోదికియ పట్టణములో ఎఫప్రా అను అపొస్తలుడైన పౌలు గారి శిష్యుడు లవోదికియ సంఘమును స్తాపించాడు. ఆ సంఘమునకు దేవుడిస్తున్న హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాము. అటువంటి ఆ పట్టణపు వారు చాల ధనము కలిగినటువంటివారు, వారు ఆ ధనమును చూసి మురిసి పోతుంటే దేవుడు వారిని గద్దిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ సంఘమును ఉద్దేశించి దేవుడు నీవు చల్లగా నైన లేవు, వెచ్చగానైనలేవు అందుకు నేను ఉమ్మివేయుచున్నాను అని హెచ్చరిస్తున్నాడు.
ఎందుకు దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు వాక్యములో మనం చుస్తే
ప్రకటన3: 17 నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగకనేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
లవోదికియా మంచి పేరు పొందిన పట్టణము, మంచి సంవృద్ది కలిగిన పట్టణము, కానీ దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారు అని అంటే వారు గర్విస్తూ ఉన్నారు. ఈ సంఘము పరిస్తితి దేవుని దృష్టిలో ఎలా ఉంది అంటే నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని దేవుడు వారిని ఉద్దేశించి పలుకుచున్నారు. అందుకే దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు నా యొద్దకు వచ్చి బంగారము, తెల్లని వస్త్రము, కాటుక కొనుడి.
ఈరోజున ఎందుకు యేసుప్రభువారు నా యొద్దకు వచ్చి బంగారము, తెల్లని వస్త్రము, కాటుక కొనుడి., అని చెప్తున్నారో దేవుని వాక్యములో ధ్యానించుకొందాము.
1.మొదటిగా యేసయ్య బంగారమును నా యెద్ద కొనుడి అని చెప్తున్నారు
బంగారము చాల ప్రత్యేకమైనది, ఎంతోమంది ఇష్టపడేది, ఇది చాల వెల కలిగినటువంటిది. అందుకే పరిశుద్ద గ్రంధములో కూడా దానిని గూర్చి వ్రాయబడినది. ప్రియులారా పాత నిభందనలో మనం చుస్తే దేవుని మందిరము బంగారపు పూతతో చేసినటువంటిది అని వ్రాయబడినది.
ఐతే బైబిల్ గ్రంధములో ఈ బంగారము గూర్చి ఏమి చెప్తుంది అని మనం చుస్తే
ద్వితీయోపదేశకాండము17:17 తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు; వెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు.
పాత నిభందన గ్రంధములో ధనవంతులైన దేవుని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, అలాగే యెబు, అబ్రహాము అయన ఎంతో గొప్ప బంగారము కలిగినటువంటివారు. మనుష్యులైనటువంటి వారికీ ఈ బంగారము అంటే ఎంతో మక్కువ అవసరమైతే బంగారము కొరకు దేవుని కూడా పక్కకు పెట్టె వారు కూడా ఉన్నారు. ఇస్రాయేలియుల జీవితంలో బంగారు వెండి కలిగినవారు, వారు మోషే తరువాత వారందరూ తమ బంగారము తిసి దానితో ఒక విగ్ర హమును చేసి మమ్ములను రక్షించినది నీవే అనుచు దానిని పూజించి దేవుని మరచిరి అని మనం చూస్తాం.
దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి అని ఈ బంగారమును గూర్చి వాక్యములో చూడవచ్చు
యెహెజ్కేలు 28:13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
బంగారముతో కట్టబడిన పరలోక పట్టణము అని పరిశుద్ద గ్రంధములో మనం చూస్తాం.
ప్రకటన గ్రంథము 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
ప్రియులారా మనమైతే బంగారముతో కూడిన దేవుని రాజ్యము మనము స్వతంత్రించుకోవాలి.
ఐతే ఈ బంగారము అనునది దేనికి సూచనగా ఉన్నది అని మనం ఆలోచిస్తే
యేసుప్రభువారు పుట్టినపుడు జ్ఞానులైన వారు ఆయనకు బంగారమును బోళమును సమర్పించారు, ఇక్కడ బంగారము రాజరికమునకు గుర్తు, ఇంకా దేనికి సూచనా అని అంటే సంతోషానికి గుర్తు, శాంతికి గుర్తు బంగారము. నీవు రాజువి., నీవు దేవుని బిడ్డవు అందుకే అది రాజరికమునకు సూచనా. ఈ బంగారమును ధరించగానే సంతోషము అంతే కాకుండా మనసుకు శాంతి కలుగుతుంది, ఇది శాంతికి సూచనా. ఇది ఆనందము కలుగజేసేది, ఇది ఒక ఘనతకు గుర్తు. ఘనతను తీసుకువస్తుంది ఈ బంగారము.
ఎందుకు మనం అయన యెద్ద బంగారమును కొనుక్కోవాలి, ప్రాముఖ్యముగా మనం తెలుసుకోవలసినది ఏమిటి అని ఆలోచిస్తే
ఎందుకు అని అంటే ఈ బంగారము యేసుక్రీస్తు వారికీ సూచనగా ఉన్నది. అవును ప్రియులారా కొలిమిలో పుటము వేయబడిన దానిని తిసినటువంటి ఆ బంగారమునకు ఉన్నసమస్త మలినాలు పోయి స్వచంముగా కనిపిస్తుంది. ఇది స్వచ్ఛతకు గుర్తు. మన కుడా యేసయ్య స్వచ్ఛమైనవాడు. అయన కొలిమిలో నుండి తీసినట్లుగా శ్రమలనే కొలిమిలో కాల్చబడి, నలుగగొట్టబడి, హింసించబడి, అనేక దెబ్బలు పడి, అయన ఒక శుద్ధ సువర్ణముగా మనకు కనిపిస్తున్నారు. అటువంటి సువర్ణముగా ఉన్న యేసు అనే బంగారము కలిగిన ఆ పరలోక పట్టణము అందుకే అయన గొప్ప వెలుగుతో నిండి ప్రకాశిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు అనే బంగారముతో ప్రకాశిస్తున్న కాంతి అనేక రత్నములతో కూడినది., అటువంటి యేసు ఈరోజున మనకు కావాలి, చిన్న బంగారమునకు ఎంతగా తహతహలాడుతమే, ఇంత కొండంత బంగారానికి మన కొరకు శ్రమలలో నుండి వచ్చిన యేసుప్రభువారిని ఈ రోజున మనం కలిగి ఉండాలి.
పరిశుద్ద గ్రంధములో ఈ బంగారును దేనికి సూచనగా ఉన్నది.
సామెతలు 20:15 బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.
ఈ బంగారము జ్ఞానమునకు సూచనా
అంతే కాకుండా ఈ బంగారము దేవుని ఆజ్ఞలకు, దేవుని శాసనములకు, దేవుని కట్టడములకు సూచనా. అయన ఇస్తున్న వాక్యమునకు సూచనా. మనము కూడా శ్రమలలో కాల్చబడిన బంగారము వలె ఉండాలి. మనము మార్చబడాలి అని అంటే మనకు గద్దింపుతో కూడిన దేవుని వాక్యము కావాలి, అటువంటి వాక్యమును విని., వాటిని అనుసరిస్తే అప్పుడు మన జీవితము కొలిమిలో నుండి తీయబడిన బంగారము వలె సువర్ణము అవుతుంది. అందుకే మనం అయన దగ్గర అయన ఇచ్చు బంగారము కొనుక్కోవాలి.
2.రెండవదిగా తెల్లని వస్త్రము నా యెద్ద కొనుడి అని యేసు ప్రభువారు చెప్తున్నారు.
కొత్త కొత్త వస్త్రాలు అంటే ఎంతో ప్రాణము మనుష్యులకు, కానీ ఇక్కడ యేసుప్రభువారు అంటున్నారు నా యెద్ద తెల్లని వస్త్రము కొనుడి అని చెప్తున్నారు. తెల్లని వస్త్రము శాంతికి, ఆధ్యాత్మికతకు సూచనా. తెల్లని వస్త్రము స్వచ్ఛతకు, పరిపూర్ణతకు, పరిశుద్దతకు సూచనా ఇది మనుష్యునకు ఘనతను ఇస్తుంది.
ఎందుకు మనం తెల్లని వస్త్రము ధరించాలి అని యేసు ప్రభువారు చెప్తున్నారు.
యేసుప్రభువారు మనకు చెప్తున్నా మాట ఏమిటి అని అంటే పరిశుద్దమైన జీవితాన్ని నా దగ్గర పొందుకోండి, అటువంటి జీవితం కావాలి అని అంటే మీరు పవిత్రపరచబడండి, మీ క్రియలు, మీ మనస్సు, మీ జీవితము పవిత్రపరచబడాలి. అందుకే నా దగ్గర మీరు తెల్లని వస్త్రములు కొనుక్కొని ధరించుకోనుడి అని చెప్తున్నారు.
ఎందుకు మనం పవిత్రపరచబడాలి అని యేసుప్రభువారు చెప్తున్నారు అని ఆలోచిస్తే
ఎందుకు అని అంటే యేసయ్య దగ్గర అపవిత్రతకు చోటు లేదు, అయన రాజ్యములో అవినీతికి చోటులేదు, అక్రమాలకు చోటులేదు, పాపానికి చోటులేదు. అందుకే మీరు తెల్లని వస్త్రము కొనుడి, మీరు తెల్లని వస్త్రము ధరించుడి అని అయన మనతో ఈరోజున చెప్తున్నారు.
అందుకే దేవుడు అంటున్నాడు , నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కొనుడి , ఎందుకు అని అంటే అప్పుడు మన పాపము ఆయనకు కనబడకూడదు, మన దోషము ఆయనకు కనపడకూడదు, నీ కల్మషము ఆయనకు ఆయనకు కనపడకూడదు. అందుకే ఇదిగో నాదగ్గర తెల్ల్లని వస్త్రమును తీసుకో దీనిని నా పరిశుద్ద రక్తమును ఇచ్చి నా రక్తమును చిందించి కొన్నాను, అటువంటి వస్త్రమును అయన మన కొరకు ఈరోజున సిద్దపరిచారు.
అటువంటి తెల్లని వస్త్రమును ధరించి మనం ఎలా జీవించాలి
దేవుని బిడ్డలుగా మనం మన ఇష్టానుసరముగా జీవించరాదు. అందుకే మనం ఆయనను, అయన ఆజ్ఞలను హత్తుకొని జీవించాలి, అయన జ్ఞానము అనే బంగారమును పొందుకొందాము, ఆయనదగ్గర ఘనతను, శాంతిని మనము సంపాదించుకొందాము. మన జీవితాలను పవిత్రపరచమని ప్రభువు పాదాలచెంత ప్రార్దిద్దాం. దేవుని మహిమ వస్త్రము మనము పొందుకొందాము.
3.ముడవదిగా మనం చుస్తే నా యెద్ద కాటుక కొనుడి అని ప్రభువారు చెప్తున్నారు
ఏమిటి ఈ కాటుక అని అంటే., కాటుక కంటికి అందమును ఇస్తుంది, మనిషికి అందము బంగారము, వస్త్రములు కాకుండా, మనకు ముఖ్యముగా అందమును ఇచ్చేది మన కన్నులే. అటువంటి కన్నులకు అందమును ఇచ్చేది ఈ కాటుక, ఇది కన్నులకు చల్లదనము ఇచ్చేది.
ఈ రోజున మన దృష్టి ఎలా ఉంది. ఎందుకు ప్రభువు కాటుక కొనుడి అని చెప్తున్నారు అని ఆలోచిస్తే
మనిషి దృష్టి ఈరోజున చెడుగా ఉన్నది, మన కన్నులు జబ్బుగల కన్నులుగా మారిపోయాయి , చీకటి గల కన్నులుగా మారిపోయాయి, ఈ కన్నులు బాగుపడాలి, ఈ కన్నులు స్వచ్చమైనవిగా ఉండాలి., ఆధ్యాత్మికమైన కన్నులుగా ఉండాలి. మనకు దేవుడు ఎందుకు ఈ కన్నులు ఇచ్చాడు అని అంటే మంచి వాటిని చూడడానికి. అందుకే నాదగ్గరకు వచ్చి కాటుక కొనుడి అని ప్రభువారు ఈరోజున చెప్తున్నారు. కంటి యొక్క విలువ ఎంతో గొప్పది. దేవుని సృష్టి ఎంతో గొప్పది. అందుకే మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ఈ కంటితో దేవుని చూచే బిడ్డలుగా మనం ఉండాలి, అయన దర్శనమును చూచే బిడ్డలుగా మనం ఉండాలి.
ఈరోజున మనం ఏమి చుస్తాన్నాము ఆలోచించుకోవాలి.
మన కన్నులు ఈరోజున లోకమును చూస్తున్నాయా, మన కన్నులు దేవుని చూస్తున్నాయా, దేవుని వాక్యమును చూస్తున్నాయా., దేనిని చూస్తున్నాయి, ఆ కన్నులకు కాటుక మలినాలను తిసివేస్తాది, అది మంచి చూపును ఇస్తున్నది, అది శారీరకమైన కాటుక కాదు గాని ఆధ్యాత్మికమైన కాటుక. ఈరోజున ఎలా ఉన్నది మన జీవితం, ఎలా ఉన్నాము. మనము ఏమి ధరించుకోవాలి. మనమైతే యేసయ్య దగ్గర విలువైన బంగారము, యేసయ్య దగ్గర తెల్లని వస్త్రము అనే పరిశుద్దమైన జీవితం, యేసయ్య దగ్గర మంచి దృష్టి కలుగుటకు కాటుక కోనుక్కోవాలి.
అలాగునే ప్రియులారా ఈరోజున ఏమి ధరించుకోవాలి
మనము క్రీస్తును ధరించుకోవాలి, అయన ఆజ్ఞలను, అయన జ్ఞానమును ధరించుకోవాలి.
కీర్తనల గ్రంథము 45:8 నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. 9 నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.
4.మనం ఏమిచ్చి అయన దగ్గర బంగారము, తెల్లని వస్త్రము, మంచి దృష్టికి కాటుక ధరించుకోవాలి.
మన వెండి బంగారములు ఆయనకు అవసరం లేదుగాని మరి మనం ఆయనకు ఏమి ఇవ్వగలం అని అంటే పశ్చాతాపంతో కూడిన మన మనస్సు, మన పరిశుద్దమైన జీవితమును ఇచ్చి అయన దగ్గర ఉన్న వాటిని పొందుకోవాలి. అయన దగ్గర శాంతి, సమాధానము, క్షమాపణ పొందుకోవాలి., అయన ఇచ్చు రక్షణను అయన రాజ్యమును స్వతంత్రించుకోవాలి.
ఈరోజున బంగారము వంటి ఆయనను కలిగి, పరిశుద్ద జీవితం అనే తెల్లని వస్త్రమును ధరించుకొని, అయన ఇచ్చు కాటుకతో మంచి దృష్టిని కలిగి., అయన ఆశీర్వాదము పొందుకోవాలి. యేసయ్య ప్రేమ అయన కృప మన అందరికి నిత్యమూ తోడై ఉండును గాక ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గక ఆమెన్.
****************************************************
26July2020
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య వీర్ల సంజీవరావు గారు
ఆదికాండము 2:1-7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
దేవుని వాక్యములో ఈ సృష్టిని గూర్చి మనం ఆలోచిస్తే అది యందు మొదటిగా ఎవరు ఉన్నారు దేవుడు మొదటిగా ఏమి సృష్టించాడు అని వాక్యములో మనం చుస్తే ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని ఇవ్వన్ని దేవుని మాట చొప్పున పలుకగా ఆ ప్రకారమాయెను. అయాదినలలో దేవుడు సృష్టించిన తరువాత అరవదినమున దేవుడు నరుని సృష్టించాడు.
దేవుడు మానవుని ఎలా సృష్టించాడు అని మనం చుస్తే
దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
దేవుడు మానవుని ఎలా సృష్టించాడు అని అంటే నరుని తన చేతి కష్టము మీద నిర్మించాడు. దేవుడు తన మాట చొప్పున చేయ వచ్చును గాని అయన మానవుని సృష్టించినపుడు చాల జాగ్రత్తగా అలోచించి ఒక నిర్ణయం చేసి సృజించాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది.
ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు
సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
దేవుడు మనలను సృష్టించినపుడు ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. నేల మంటితో నరుని నిర్మించాడు అసలు ఎందుకు నేల మంటితో నిర్మించాడు అని అంటే మన్ను అయన చెప్పినట్లుగా మాట వింటుంది అని అయన ఆలోచన.
1.దేవుడు ఎటువంటి నేల మంటితో నరుని నిర్మించాడు మానవుడు ఎక్కడ నిర్మించబడ్డాడు అని మనం ఆలోచిస్తే
దేవుడు మాములుగా ఉన్న నేల మంటితో నరుని నిర్మించలేదు, మనం ఆలోచిస్తే ఇందులో ఒక లోతైన మర్మము మనకు కనిపిస్తుంది. అది తెలుసుకోవాలి అని అంటే మనకు భూమి యొక్క చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర ఏమిటి అని అంటే భూమిని దేవుడు ముఖ్యంగా నాలుగు భాగాలుగా సృష్టించాడు.
మొదటిది భూమి యొక్క పై పొర అని అంటారు దాని లోతును గూర్చి మనం ఆలోచన చేస్తే డబ్బై కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటిది కానీ ఇటువంటి మలినమైనటువంటి మట్టి నుండి మానవుని నిర్మించలేదు ఎందుకు అని అంటే అది దేవుని దృష్టిలో సరైనది విలువైనతువంటిది కాదు అని దేవుడు తలచాడు. ఎందుకు అని అంటే ఈ పైన ఉన్నటువంటి మట్టి మలినములతో కూడినది.
రెండవది భూమి యొక్క అగాధము డబ్బై కిలోమీటర్ల లోతులో నుండి రెండువేల తొమ్మిది వందల కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటిది. అది ఎలా ఉంటుంది అని అంటే అగ్ని పర్వతాల నుండి బయటపడిన లావా వలే అగ్నితో కూడిన మట్టి కలిగినది దీని పేరు అగాధములో ఉన్న మంటి.
మూడవది భాగం ఔటర్ కోర్ ఇది రెండువేల ఆరువందల కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఇక్కడ నికిల్, ఐరన్ కానీ ద్రవ పదార్దంతో కూడినది. ఇందులో నుండి మట్టితో కూడా మానవుని సృష్టించలేదు.
నాల్గవదిగా తరువాత పన్నెండ్రు వందల కిలోమీటర్ల లోతున ఉన్న భూమి ఇన్నర్ కోర్. ఇక్కడ ఏమి
ఉంటుంది అని అంటే నికిల్, ఐరన్ కానీ ఘన పదార్దంతో కూడినదిగా ఉంటుంది. ఇందులో నుండి మట్టితో కూడా మానవుని సృష్టించలేదు. ఎందుకు అని అంటే ఈ మట్టి అన్ని మలినాలతో కూడినది. మొత్తంగా ఈ భూమి అరు వేల ఏడువందల డబ్బై కిలో మీటర్లు లోతు కలిగినది.
దేవుడు చెప్తున్నాడు నేల మట్టితో నరుని నిర్మించితిని అని యే మట్టితో మనం నిర్మించాబడ్డం ఒకసారి మనం ఈ రోజున ఆలోచించుకోవాలి.
2.నీవు నిర్మించబడిన మట్టి ఎలాంటిది ఎలాంటి మట్టి నుండి నీవు నిర్మించబడ్డావు., ఎందుకు దేవుడు మనలను నిర్మించాడు.
ఎందుకు అని అంటే దేవుడు మనలో ఉండాలి అని ఆశిస్తున్నాడు కాబట్టి అయన నరుని నిర్మించాడు, అయన మనలను తయారు చేసినపుడు చాల జాగ్రత్త తీసుకున్నాడు, ఒక వేల భూమి యొక్క పై పొర నుండి తయారు చేస్తే వారి యొక్క దేహము మలినమై పోతుంది అని దాని నుండి మనలను చేయలేదు, అలాగే భూమి యొక్క ఓటర్ కోర్, ఇన్నర్ కోర్ కూడా మురికితో కూడినది కావున ఈ మూడు నరుని సృష్టించడానికి వీలులేదు, ఎందుకు అని అంటే అయన మనలను ఎంతో పవిత్రంగా సృష్టించాలి అని అయన కోరుచున్నాడు, ఎందు కొరకు అని అంటే అయన కొరకు మనం ఒక సాక్షిగా ఉండాలి అని అయన ఆలోచన.
అందుకే దేవుడు నరుని నిర్మించడానికి భూమి యొక్క అగాధము నుండి తీసిన అగ్నితో కూడిన మట్టితో మనలను సృజించాడు, అయన చాల కష్టపడి అయన స్వహస్తాలతో నిర్మించాడు అని దేవుని వాక్యము చెప్తుంది.
కీర్తనల గ్రంథము 139:14-15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు.
ఎందుకు దేవుడు మనలను భూమి యొక్క ఆగాధము నుండి తీసిన అగ్నితో కూడిన మట్టితో నిర్మించాడు అని అంటే మనం పవిత్రముగా ఉండాలి. మనము పరిశుద్ధంగా ఉండాలి అని అయన ఆలోచన అప్పుడే దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఇటువంటి భయంకరమైన మట్టితో మనవ శరీరం నిర్మించాడు. అందుకే ప్రభువు పట్ల మన హృదయం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.
అందుకే దేవుని వాక్యం చెప్తుంది.
యోబు గ్రంథము 10:9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
ఆవిధంగా మనలను నిర్మించి నరుని తయారు చేసి నాశిక రంద్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
3.ఎందుకు దేవుడు మనలను అంత పవిత్రమైన మట్టితో నిర్మించాడు అంటే దేవుని వాక్యము చెప్తుంది.
1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.
లేవీయకాండము 11:45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
దేవుడు పరిశుద్దుడు కావున మనలను పరిశుద్ధంగా సృష్టించాడు. ఆవిధంగా సృష్టించి మన హృదయంలో ఆయన ఉండాలి అని అయన కోరుచున్నాడు కాబట్టి అటువంటి ఆత్మను మన హృదయంలో పెట్టాడు.
గలతీయులకు 4:6 మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
4.కానీ ఈరోజున మన ఆత్మ దేవుని దృష్టికి ఎలా ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది అని చుస్తే
ఆదికాండము 6:5 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.
దేవుడు నరుని యొక్క చెడుతనమును చూసి తన హృదయములో అయన ఈరోజున నోచ్చుకోనుచున్నాడు. ఎందుకు అని దేవుని మాటను లెక్క చేయక అయన మాటను అయన ఆజ్ఞను అతిక్రమించి మనము ప్రవర్తించుచున్నాము. దేవుడు అందుకే ఈరోజున మనలను బట్టి అయన చింతిస్తున్నాడు., అయన ఈరోజున చాల వేదన చెందుతున్నాడు.
అందుకే యేసుప్రభువారు మనలను చూసి చింతించి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకు అని అంటే అయన కొరకు మనం పరిశుద్ధంగా జీవించడానికి అయన హృదయంలో మనం ఉండటానికి. అలాగున ఉండాలి అంటే మొదటిగా మనం మారాలి, మన ద్వార అనేకులు మార్చడానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని అయన చెప్పాడు. అందుకు మనం పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి.
5.ఈరోజున మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుచున్నాడు అని చుస్తే
మొదటిగా మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండాలి.
1 పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
ఈరోజున మనం ప్రవర్తన ఎలా ఉన్నదో చూచుకొని ఆ ప్రవర్తనను సరి చేసుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి.
మనలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని ఉండరాదు.
ఎఫెసీయులకు 5:3 మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
మనలో జారత్వముగాని అపవిత్రతయే గాని,లోభావత్వమే గాని మన హృదయంలో ఉండరాదు. మనం పవిత్రంగా ఉండాలి ఎందుకు అని అంటే ఆ పవిత్రతే మనలను పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్తుంది. అటువంటి పవిత్రతయే మన జీవితంలో మనం కలిగి దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి సహాయపడుతుంది. మనం దేవుని నిత్యం స్తుతించాలి., సమస్త దుర్నితిని మన నుండి దూరపరచి నిత్యం యేసయ్యతో ఉండే గొప్ప భాగ్యం అందరికి అందించాలని ఆశిస్తూ ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
No comments:
Post a Comment